AP News: కాకినాడ మేయర్పై ముగిసిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ.. ఫలితం రిజర్వ్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర పావనిపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం
విప్ ధిక్కరించిన తెదేపా అసమ్మతి కార్పొరేటర్లు
కాకినాడ నగరం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్-1 సత్తిబాబుపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ప్రొసీడింగ్ అధికారి, జేసీ లక్ష్మీశ ప్రకటించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని రిజర్వులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో తెదేపా అసమ్మతి కార్పొరేటర్లు విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. ఎక్స్అఫీషియో హోదాలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఓటింగ్లో పాల్గొన్నారు.
కాకినాడలోని 50 డివిజన్లకు.. 48 చోట్ల 2017లో ఎన్నికలు జరిగాయి. కార్పొరేటర్లలో ముగ్గురు మరణించగా, ఒకరు రాజీనామా చేశారు. దీంతో కార్పొరేటర్ల సంఖ్య 44కి చేరింది. వీరిలో తెదేపా-30, వైకాపా-8, భాజపా-3, స్వతంత్రులు 3 ఉన్నారు. ప్రస్తుత తెదేపా సభ్యుల్లో 21 మంది, ఇద్దరు భాజపా సభ్యులు అసమ్మతి వర్గంలో ఉన్నారు. వీరితో పాటు వైకాపా, స్వతంత్రులు కలిపి మొత్తం 33 మంది కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్కు లేఖలు అందజేశారు. ఈ నేపథ్యంలో జేసీ లక్ష్మీశ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య