TS News : ఉద్రిక్త పరిస్థితుల మధ్య రేవంత్‌రెడ్డి అరెస్టు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఎర్రవెల్లిలో రచ్చబండకు

Updated : 27 Dec 2021 15:32 IST

హైదరాబాద్‌ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఎర్రవెల్లిలో రచ్చబండకు రేవంత్‌ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని పోలీసులు మోహరించి గృహనిర్బంధం చేశారు. అయితే ఎర్రవెల్లి వెళ్లేందుకు ఆయన కార్యకర్తలతో కలిసి బయటకి రాగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకుని సమీప పోలీసుస్టేషన్‌కు తరలించారు.

అయితే అప్పటికే రేవంత్‌ నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి నిరసనల మధ్యే రేవంత్‌ను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు నిర్బంధాలు ఎన్ని ఉన్నా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లికి వెళ్తానని.. అక్కడ రచ్చబండ నిర్వహించి తీరుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని