AP News: వివేకా హత్య కేసులో జగన్‌నూ విచారించాలి: పట్టాభి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనకున్న శంకర్‌రెడ్డి.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెదేపా అధికార

Updated : 16 Nov 2021 13:14 IST

మంగళగిరి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనకున్న శంకర్‌రెడ్డి.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డిల ప్రస్తావన ఉందని పట్టాభి చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పట్టాభి మీడియాతో మాట్లాడారు.

వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలు తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలే అని ఆరోపించారు. సిట్‌ను రెండుసార్లు మార్చి సీఎం జగన్‌ నీరుగార్చే ప్రయత్నం చేశారని పట్టాభి ఆరోపణలు చేశారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో పాటు జగన్‌ కూడా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు