
Updated : 28 Oct 2021 09:39 IST
Ts News: ప్రభుత్వంపై రైతులు తిరగబడే పరిస్థితి వస్తుంది: ఉత్తమ్కుమార్రెడ్డి
హైదరాబాద్: వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఆంక్షలు విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. రైతులపై ఆంక్షలు పెట్టే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. సిద్దిపేట కలెక్టర్ తీరును రైతు లోకమంతా గర్హిస్తోందన్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. వరి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
Tags :