Vinukonda: వైకాపా కవ్వింపు చర్యలు.. వినుకొండలో ఉద్రిక్తత

పల్నాడు జిల్లా వినుకొండలో వైకాపా శ్రేణుల ఆగడాలు హెచ్చుమీరాయి. 

Published : 13 Mar 2024 21:34 IST

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండలో వైకాపా శ్రేణుల ఆగడాలు హెచ్చుమీరాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావుల ఆధ్వర్వంలో తెలుగుదేశం కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించగా.. అధికార పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. వినుకొండలోని ఎన్ఎస్పీ కాలనీ వద్ద మాజీ సీఎం రోశయ్య విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులతో వచ్చారు. అదే సమయంలో తెదేపా ర్యాలీ అటు రాగా...వైకాపా శ్రేణులు తెదేపా కార్యకర్తలతో వాగ్వాదానికి దిగాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు సవాళ్లు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. వైకాపా కార్యకర్తలు పెద్ద పెద్ద కర్రలు తీసి దాడి చేసేందుకు యత్నించగా...పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించి...తెదేపా శ్రేణులను ముందుకు పంపించడంతో గోడవ సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని