Tamilnadu Politics: కుమారుడికి బాధ్యతలు.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగిస్తారని అధికారపార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్కు (Udhayanidhi stalin)డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగిస్తారని అధికార డీఎంకేలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోపే కుమారుడికి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. జనవరి 21న సేలంలో పార్టీ యూత్ వింగ్ (యువ విభాగం) సమావేశం జరగనుంది. ఈ వేదికపైనే ఉదయనిధిని డిప్యూటీగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిపై ఆ పార్టీ కార్యదర్శి టీకేఎస్ ఇలాంగోవన్ స్పందించారు. తనకు స్పష్టమైన సమాచారం లేదని చెప్పిన ఆయన.. ఉదయనిధి పనితీరును ప్రశంసించారు. మంత్రిగా బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని కితాబిచ్చారు. అయితే, డిప్యూటీ సీఎం పదవి ఆయనకు ఇస్తారా? లేదా అన్నది మాత్రం సీఎం చేతుల్లోనే ఉందని చెప్పారు. మరోవైపు, అ వార్తలను ఉదయనిధి స్టాలిన్ కొట్టిపారేశారు. అదంతా తప్పుడు ప్రచారమేనని జాతీయ మీడియాకు తెలిపారు.
తాజా పరిణామాలు గాలి వార్తలు కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నవేనని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధికి టికెట్ కేటాయించినప్పుడే డిప్యూటీ సీఎం ఇవ్వాలని నిర్ణయించారని, వెంటనే ఇస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తొలుత మంత్రి పదవి ఇచ్చి, ఇప్పుడు ఉపముఖ్యమంత్రి హోదా కల్పిస్తున్నారని విమర్శించింది. 2026 ఎన్నికల్లో అతడినే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారానికి వెళ్తారని తెలిపింది. ప్రజాస్వామ్య ముసుగులో వారసత్వపాలనకు డీఎంకే పార్టీయే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడింది. తాత, తండ్రి, మనవడు ఇలా ఆ ఒక్క కుటుంబం చేతిలోనే అధికారం ఉంటోందని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్