Minister Puvvada Ajay: వచ్చే ఎన్నికల్లో 88-90 స్థానాలు గెలుస్తాం: మంత్రి పువ్వాడ అజయ్‌

భారాస మేనిఫెస్టోతో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు కొట్టుకుపోయాయని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు.

Published : 17 Oct 2023 13:45 IST

ఖమ్మం: భారాస మేనిఫెస్టోతో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు కొట్టుకుపోయాయని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఖమ్మం భారాస కార్యాలయంలో అభ్యర్థుల మీడియా సమావేశంలో  మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారాస సర్కార్‌ అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రంలోని భాజపా సర్కార్‌ కూడా కాపీ కొట్టిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని మంత్రి అజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని