Kishan Reddy: తెలంగాణలో డబుల్‌ డిజిట్‌లో ఎంపీ సీట్లు గెలుచుకుంటాం: కిషన్‌ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్‌ డిజిట్‌లో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated : 26 Dec 2023 14:25 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్‌ డిజిట్‌లో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించకపోయినా అద్భుతమైన విజయాలను భాజపా సొంతం చేసుకుందన్నారు. మోదీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఎదురుచూస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేసేందుకు డిసెంబరు 28న రంగారెడ్డి జిల్లా కొంగర సమీపంలో విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కిషన్‌ తెలిపారు. రానున్న ఎన్నికలకు 90 రోజుల కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరవుతున్నట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని