Himachal Pradesh election:గెలిచాం సరే..మరీ ఓపీఎస్ అమలు ఎలా?
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh )లో పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించడం కొత్త ఏర్పడిన కాంగ్రెస్(Congress ) ప్రభుత్వానికి సవాలుగా మారనుంది.
ఇంటర్నెట్డెస్క్: హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. అక్కడ వారికి అధికారం కట్టబెట్టడంలో ‘పాత పింఛన్ పథకం(ఓపిఎస్) పునరుద్ధరణ’ హామీ కీలకంగా పనిచేసింది. ఆ రాష్ట్రంలో దాదాపు 2.5లక్షల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. వారిలో 1.5లక్షల మంది కొత్త పింఛన్ పథకం కింద ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రయోజనం కల్పించే ఈ హామీ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపింది. వాస్తవానికి ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టడం హిమాచల్లో కలిసి వచ్చింది. ఈ సారి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ల్లో కూడా పాత పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది. గుజరాత్లో భారీ ఓటమి నుంచి ఈ హామీ పార్టీని రక్షించలేకపోయింది. కానీ, హిమాచల్లో మాత్రం అధికారపగ్గాలను అందించింది. వాస్తవానికి హిమాచల్ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ పథకం అమలు కొత్త ప్రభుత్వానికి కఠిన సవాళ్లతో కూడుకొన్న విషయమని అర్థమవుతుంది.
ఆర్థిక వనరులు కటకటా..
31 మార్చి 2021 నాటి స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్టు మేరకు హిమాచల్ ప్రభుత్వం కచ్చితంగా చేయాల్సిన వ్యయాలు రూ.22,464 కోట్లుగా ఉన్నాయి. 2016-17లో ఇవి కేవలం రూ.17,154 కోట్లు మాత్రమే. ఈ వ్యయాల్లో వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఈ వ్యయాలు రాష్ట్రం మొత్తం ఖర్చులో 65.31శాతం నుంచి 67.19శాతానికి పెరిగాయి. ఇటువంటి ఖర్చులు పెరిగాయంటే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గుతాయని అర్థం. 2020-21 లెక్కల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యయంలో కేవలం మూడో వంతు మాత్రమే అభివృద్ధికి కేటాయించే పరిస్థితి నెలకొంది.
* 2020-21 నాటికి రూ.6,088 కోట్లు పింఛన్పై వెచ్చించారు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఈ వ్యయం 50శాతం పెరిగినట్లు లెక్క. ఇక ఆదాయ వనరుల్లో పింఛన్ వ్యయం వాటా 2016-17లో 15.66 శాతం నుంచి 2020-21 నాటికి 18.21శాతానికి చేరింది.
* 2020-21 నాటికి హిమాచల్ ప్రదేశ్కు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ద్వారా వచ్చే సొమ్ము.. మొత్తం ఆదాయంలో నాలుగో వంతు మాత్రమే ఉంది. అదే జాతీయ స్థాయిలో రాష్ట్రాల మొత్తం ఆదాయాల్లో స్థానిక పన్నుల రాబడి శాతం సగటు 38.04గా ఉంది. దీనిని చూసే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనావేయచ్చు. హిమాచల్ రాష్ట్ర వృద్ధికి తగ్గట్లు ఆదాయం మాత్రం లేదు. 2021 లెక్కల ప్రకారం ఆ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ఈ నేపథ్యంలో ఓపీఎస్ను అమలు చేయడం కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాముగా మారనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్