TDP: నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన సీఎం జగన్ సన్నిహితుడు
సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు బసవరావు గురువారం తెదేపాలో చేరారు.
అమరావతి: సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు గురువారం తెదేపాలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకొన్నారు. మంగళగరి గ్రామీణ మండలం కురగల్లుకు చెందిన బసవరావు ఆధ్వర్యంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. గతంలో జగన్కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖపట్నం వరకు ఆయన 2వేల కి.మీ పాదయాత్ర చేశారు. జగన్ విధానాలతో విభేదించి ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాము తెలుగుదేశంలో చేరుతున్నట్లు వెల్లడించారు.
ఎస్సీల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారని, 188 మంది ఎస్సీలను ఊచకోత కోశారని లోకేశ్ ఆరోపించారు. కూటమి వచ్చాక ఎస్సీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.