YS Sharmila: వైకాపా.. అభివృద్ధిని పక్కనపెట్టి భాజపా జపం చేస్తోంది: వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు.
‘‘ఏపీకి ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మర్చిపోయారు. హోదా ప్రస్తావన తీసుకొస్తే జైల్లో పెట్టించారు. ఇక సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక స్వలాభం చూసుకున్నారే కానీ.. ఈ ఐదేళ్లలో హోదాపై ఉద్యమం చేసింది లేదు. హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు.. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తే ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి?
శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణించా. మద్య నిషేధం అన్నారు.. ఇప్పుడేమో ఎక్కడ చూసినా మద్యం లభిస్తోందని పలువురు మహిళలు చెప్పింది విన్నాక బాధేసింది. మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నారు. మరి ఎక్కడికి పోయింది సీఎం జగన్ ఇచ్చిన హామీ? పోలవరం ప్రాజెక్టును వదిలేశారు. అభివృద్ధిని పక్కనపెట్టిన వైకాపా, తెదేపా.. భాజపా జపం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు భాజపాకు బానిసలుగా మారాయి’’ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
-
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
-
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
-
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన