YSRCP: వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే

చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 

Updated : 24 Mar 2024 16:21 IST

హైదరాబాద్‌: మరో ఎమ్మెల్యే వైకాపాను వీడారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్‌ కండువా కప్పి ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఉదయం తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ భాజపాలో చేరిన విషయం తెలిసిందే. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన ఎలీజాకు టికెట్‌ దక్కకపోవడంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరాజును ఆ పార్టీ అధినేత జగన్‌ ప్రకటించారు. దీంతో ఇవాళ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు