మూడో టెస్టు వేదికపై సీఏ స్పష్టీకరణ
టీమ్ఇండియాతో మూడో టెస్టు వేదిక సిడ్నీయే అని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. నాలుగో టెస్టు కోసం సిడ్నీ నుంచి బ్రిస్బేన్ వెళ్లడం కష్టం కాబట్టి మూడో టెస్టును మెల్బోర్న్కు తరలిస్తున్నారన్న వదంతులను కొట్టిపారేసింది. అద్భుతంగా జరుగుతున్న ఈ టెస్టు సిరీసు షెడ్యూలు...
సిడ్నీ: టీమ్ఇండియాతో మూడో టెస్టు వేదిక సిడ్నీయే అని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. నాలుగో టెస్టు కోసం సిడ్నీ నుంచి బ్రిస్బేన్ వెళ్లడం కష్టం కాబట్టి మూడో టెస్టును మెల్బోర్న్కు తరలిస్తున్నారన్న వదంతులను కొట్టిపారేసింది. అద్భుతంగా జరుగుతున్న ఈ టెస్టు సిరీసు షెడ్యూలు, వేదికలను మార్చే ఉద్దేశం లేదని వెల్లడించింది.
ఎంసీజీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 1-1తో సమం చేసింది. ఇందులో భాగంగానే జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్-19 కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తున్న వారిపై ఇతర రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. వారి ప్రవేశాలపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా మూడో టెస్టు తర్వాత బ్రిస్బేన్ వెళ్లేందుకు ఆటగాళ్లకు కష్టమవుతుందని భావిస్తున్నారు.
‘కొవిడ్-19 మహమ్మారి వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ సిరీసుల షెడ్యూలును యథాతథంగా నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కట్టుబడి ఉంది. సిడ్నీలో ప్రజారోగ్య పరిస్థితులు, సరిహద్దు ప్రవేశ ఆంక్షల గురించి మేం నిరంతరం చర్చిస్తున్నాం. సిడ్నీలో మూడు, బ్రిస్బేన్లో నాలుగో టెస్టు సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించడంపై మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు..
నోళ్లు మూయించిన రహానె సేన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్