Cricket News: ఆ సకారియా వేరు.. 24 గంటల్లోనే బీసీసీఐ యూ టర్న్.. ‘సంజు శాంసన్ను కెప్టెన్గా తప్పించాలి’
చేతన్ సకారియాను అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చిన బీసీసీఐ (BCCI) యూ టర్న్ తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ టీమ్ఇండియా యువ పేసర్ చేతన్ సకారియా (Chetan Sakariya)ను అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే, 24 గంటలు కూడా ముగియకముందే ఈ విషయంలో బీసీసీఐ (BCCI) యూ టర్న్ తీసుకుంది. అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేతన్ సకారియా లేడని, సమాచారం లోపం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. కర్ణాటకకు చెందిన చేతన్ అనే పేరుగల బౌలర్ ఈ జాబితాలో ఉండాల్సిందని, పొరపాటున అతని పేరుకు బదులు చేతన్ సకారియా పేరు వచ్చిందని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా పేర్కొన్నారు. ‘‘సమాచార లోపం వల్ల ఇలా జరిగింది. అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన జాబితాలో చేతన్ సకారియా లేడు. ఆ జాబితాలో కర్ణాటక బౌలర్ పేరు ఉండాలి. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలియజేశాం’’ అని జయదేవ్ షా వివరించారు.
ఐపీఎల్ 2023 సీజన్లో చేతన్ సకారియా దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం అతడిని దిల్లీ ఫ్రాంఛైజీ రిలీజ్ చేసింది. డిసెంబరు 19న దుబాయ్ వేదికగా జరగనున్న మినీ వేలంలో సకారియా ధర రూ.50 లక్షలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 2021 ఐపీఎల్ సీజన్లో సకారియా రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించి 14 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమ్ఇండియాలో చోటు దక్కించుకుని ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు.
IPL 2024: సంజు శాంసన్ను కెప్టెన్గా తప్పించాలి
సంజు శాంసన్ (Sanju Samson)ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ సూచించాడు. రాజస్థాన్ సారథ్య బాధ్యతలను జోస్ బట్లర్ వంటి ఆటగాడికి అప్పగించాలన్నాడు. శాంసన్ నాయకత్వంలో 2022 సీజన్లో ఫైనల్కు చేరిన రాజస్థాన్ రాయల్స్.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కు కూడా రాలేదు. 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. “రాజస్థాన్ రాయల్స్ తన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. నేను రాజస్థాన్ రాయల్స్కు ఆడినప్పుడు మేనేజ్మెంట్ అన్ని విషయాల్లో జాగ్రత్త వహించేది. రాహుల్ ద్రవిడ్ భాయ్ కెప్టెన్. సారథిగా జట్టును ఎలా ముందుకు నడిపించాలనే దానిపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండేది. ఇప్పుడు ఆ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్గా ఉన్నాడు. అతడు కెప్టెన్సీని చాలా సీరియస్గా తీసుకోవాలి లేదంటే జోస్ బట్లర్ని కెప్టెన్గా చేయాలి. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ గెలిచింది. అతడు జట్టును సమర్థంగా ముందుకు నడిపించగలడు. లేదంటే నిలకడగా ఆడుతున్న ఆటగాడి వైపు ఫ్రాంఛైజీ చూడాలి. రోహిత్ శర్మ లాంటి నాయకుడు ఆ జట్టుకు అవసరం’’ అని శ్రీశాంత్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం