Ashwin: వన్డే వరల్డ్ కప్ 2023.. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు.. పరిస్థితులు తెలుసుంటే చాలు: అశ్విన్
వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) భారత వేదికగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఇప్పటికే మ్యాచ్ల సమయాన్ని కాస్త ముందుకు జరిపితే బాగుంటుందనే సూచనలు చేశాడు. తాజాగా టీమ్ఇండియా (Team India) విజేతగా నిలుస్తుందా..? లేదా..? అనే విషయంపైనా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు పుష్కర కాలం (2011) కిందట భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ను ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్ఇండియా కైవసం చేసుకొంది. ఇక ఆతర్వాత రెండు సార్లు జరిగినా.. కప్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి స్వదేశం వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నీ సిద్ధమవుతోంది. దీంతో టీమ్ఇండియాపై అంచనాలు పెరిగాయి. సొంత గడ్డపై భారత్ను ఓడించడం అంత సులువైన విషయం కాదని ప్రత్యర్థులకూ తెలుసు. అయితే, సరైన టీమ్ను ఎంపిక చేసి ఆడించడమే బీసీసీఐ ఎదుట ఉన్న ప్రధాన సవాల్. రోహిత్ నాయకత్వంలో ఆడబోయే వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా సన్నాహకాలపై సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. సన్నద్ధతలో భాగంగా ఒక విషయం ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. భారత్లోని వేర్వేరు మైదానాల్లో ఆడాల్సి ఉండటంతో.. అక్కడి పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలని సూచించాడు.
‘‘2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి భారత్ వేదికగా జరిగిన మ్యాచుల్లో అత్యధిక విజయాలు సాధించాం. ఇక్కడకు వచ్చిన ప్రతి దేశంపైనా ద్వైపాక్షిక సిరీస్లను భారత్ కైవసం చేసుకొంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.. ఇలా ద్వైపాక్షిక సిరీసుల్లో భారత్ 14-4 ఆధిక్యంతో కొనసాగుతోంది. దాదాపు 14 వేర్వేరు వేదికల్లో 18 వన్డే మ్యాచ్లు జరిగాయి. 80 శాతం వరకు విజయం సాధించాం. అదే ఆసీస్, ఇంగ్లాండ్ జట్లతో పోలిస్తే.. అక్కడ వారు కేవలం నాలుగైదు వేదికల్లోనే టెస్టులు, 2 లేదా 3 మైదానాల్లోనే వన్డేలు ఆడారు’’
స్వదేశంలో మైదానాలు వన్డే ప్రపంచకప్ను నెగ్గేందుకు భారత్కు అవకాశాలు ఉంటాయా..? అనే ప్రశ్నకు అశ్విన్ సమాధానం ఇచ్చాడు. ‘‘2011 వరల్డ్ కప్ నుంచి ఉదాహరణగా తీసుకొంటే.. స్వదేశంలో ఆడిన జట్టు కప్ను నిలబెట్టుకొంది. 2011లో భారత్, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ టైటిల్ను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. కాబట్టి.. ఇక్కడేమీ రాకెట్ సైన్స్ సూత్రాలు ఏమీ లేవు. పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైతేనేమీ టీమ్ఇండియా ఇక్కడ చాలా వేదికల్లో మ్యాచ్లను ఆడింది’’ అని అశ్విన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్