IND Vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. తొలి రోజు భారత్దే
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా బౌలర్లు రాణించారు. దీంతో బంగ్లా జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిలకడగా ఆడింది.
మీర్పూర్: బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు (Test Match)లో తొలి రోజు టీమ్ఇండియా (Team India)కే ఆధిపత్యం దక్కింది. సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin), ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) విజృంభించారు. దీంతో ఒక దశలో 213/5తో పటిష్ఠంగానే కన్పించిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మామినుల్ హక్(84: 12 ఫోర్లు, ఒక సిక్స్) ఒంటరి పోరాటం చేసినా ఇతర ఆటగాళ్లెవరూ సహకరించలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమేశ్, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. జయదేవ్ ఉనద్కత్ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు నిలకడగా ఆడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (3*), శుభ్మన్ గిల్(14*) క్రీజులో ఉన్నారు. మధ్యలో రెండుసార్లు వీరు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ను కుదించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో ఉంది.
బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉన్న రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్ను క్వీన్స్వీప్ చేయాలని చూస్తోంది. అలా జరిగితేనే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో నిలిచేందుకు భారత్కు అవకాశాలు మెరుగుపడుతాయి.
మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆతిథ్య జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో మామినుల్ హక్(84: 12 ఫోర్లు, ఒక సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్(24), లిటన్ దాస్ (25), ముష్ఫికర్ రహీం (26) ఫర్వాలేదనిపించారు.
ఇక భారత బౌలింగ్లో ఉమేశ్ యాదవ్, అశ్విన్ మెరిశారు. 15 ఓవర్లు వేసిన ఉమేశ్.. 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 21.5 ఓవర్లు వేసిన అశ్విన్.. 71 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లు పడగొట్టాడు.
బంగ్లా జట్టు స్కోరు 200 దాటింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మామినుల్ హక్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు శతకానికి చేరువయ్యాడు. 67 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లా ఆరు వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది. క్రీజులో హక్(81*), నురుల్ హసన్ (3*) ఉన్నారు.
రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లా జట్టు నిలకడగా ఆడుతోంది. సగం వికెట్లు కోల్పోయినా మామినుల్ హక్ (65*) జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. టీ విరామ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో హక్, మెహిది హసన్ మిరాజ్(4*) ఉన్నారు. భారత బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కత్ 2, రవిచంద్రన్ అశ్విన్ 2 , ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
రెండో టెస్టులో బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టు సగం వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లను కోల్పోయిన తర్వాత మామినుల్ హక్తో కలిసి కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే భోజన విరామం తర్వాత తొలి బంతికే షకీబ్ను భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ బోల్తా కొట్టించాడు. 29వ ఓవర్లో ఉమేశ్ వేసిన తొలి బంతిని భారీ షాట్కు యత్నించిన షకీబ్(16).. మిడాఫ్లో పుజారాకు చిక్కాడు. ఆ తర్వాత కాసేపటికి ముష్ఫికర్ రహీం, మామినుల్ హక్ భాగస్వామ్యాన్ని ఉనద్కత్ విడగొట్టాడు. 41వ ఓవర్ చివరి బంతికి ముష్ఫికర్ రహీం(26)ను ఔట్ చేశాడు. ఇక, జోరు మీదున్న లిటన్ దాస్(26)ను అశ్విన్ పెవిలియన్ను పంపించాడు. దీంతో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హక్(59*).. అర్ధశతకం సాధించాడు. ప్రస్తుతం 50 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లా స్కోరు 177/5గా ఉంది.
రెండో టెస్టులో ఆతిథ్య జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లా.. భోజన విరామ సమయానికి 28 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఓపెనర్లు జాకిర్ హసన్(15), నజ్ముల్ హొస్సేన్(24)ను భారత బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, అశ్విన్ వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (16*), మామినుల్ హక్ (23*) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.
మీర్పూర్: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన రెండో టెస్టుకు భారత్, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ ఉనద్కత్కు జట్టులో చోటు దక్కింది. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు రెండో టెస్టులో నెగ్గి సిరీస్ను డ్రా చేయాలని బంగ్లా జట్టు కసితో ఉంది.
భారత జట్టు: కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అశ్విన్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్
బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్, జాకిర్ హసన్, మామినుల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం, షకిబ్ అల్ హసన్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తజ్ముల్ ఇస్లాం, సయ్యద్ ఖాలేద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్