IPL 2022 : యూఏఈ కంటే చౌకగా.. ఐపీఎల్ నిర్వహిస్తాం: సీఎస్ఏ
భారత్లోనే ఐపీఎల్ 2022 మ్యాచ్లను నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే...
ఇంటర్నెట్ డెస్క్: భారత్లోనే ఐపీఎల్ 2022 మ్యాచ్లను నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. ముంబయిలోని రెండు స్టేడియాల్లో అవసరమైతే పుణె మైదానంలో మ్యాచ్లు జరుగుతాయని పేర్కొంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ క్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు సమాచారం. గత సంవత్సరం యూఏఈ వేదికగా ఐపీఎల్ జరిగిన విషయం తెలిసిందే. యూఏఈ కంటే చౌకగా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించుకోవచ్చని ప్రతిపాదించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. బీసీసీఐ, సీఎస్ఏ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
మైదానాల వద్దకు వెళ్లేందుకు తక్కువ ప్రయాణ ఛార్జీలు, యూఏఈతో పోలిస్తే హోటల్ టారిఫ్లు అందుబాటులో ఉండేలా చూస్తామని సీఎస్ఏ హామీనిచ్చినట్లు సమాచారం. దీని వల్ల ఫ్రాంచైజీల ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. సీఎస్ఏ బ్లూప్రింట్ ప్రకారం.. దక్షిణాఫ్రికాలోని నాలుగు స్టేడియాల్లోనే మొత్తం మ్యాచ్లను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. జోహెన్నెస్బర్గ్, ప్రిటోరియా, బెనోని, పోట్చెఫ్స్ట్రోమ్ ప్రాంతాల్లో మ్యాచ్లను ఆడించవచ్చు. అన్ని మైదానాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని, ప్రయాణ దూరం కూడా ఎక్కువగా ఉండదు. అయితే బీసీసీఐ, సీఎస్ఏ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దక్షిణాఫ్రికా వేదికగానే 2009 ఐపీఎల్ సీజన్ మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2022 మ్యాచ్ల వేదికలను ఫిబ్రవరి 20న బీసీసీఐ ఖరారు చేయనుంది. భారత్లోనే మ్యాచ్లను నిర్వహించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాలు బీసీసీఐని కోరుతున్నాయి. అయితే బీసీసీఐ సభ్యుల్లో కొందరు ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈసారి ఐపీఎల్లో 10 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని