టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది.
ముంబయి: టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది.
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు!
పోర్టాఫ్ స్పెయిన్: వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ట్రినిడాడ్ ప్రధాన మంత్రి కీత్ రోలీ చెప్పారు. అయితే జూన్ 2న ఆరంభమయ్యే ఈ టోర్నమెంట్కు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ సహా 20 జట్లు పోటీపడే ప్రపంచకప్ తొమ్మిది వేదికల్లో జరగనుంది. ఆరు వేదికలు వెస్టిండీస్లో, మూడు వేదికలు అమెరికాలో ఉన్నాయి. బెదిరింపులు ఏ సంస్థ నుంచి వచ్చాయన్నది రోలీ వెల్లడించలేదు. ఇస్లామిక్ స్టేట్ బెదిరింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఐసీసీ స్పందించింది. టోర్నీ భద్రతకు హమీనిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘ఈ టోర్నీలో ప్రతి ఒక్కరి భద్రతే మాకు అన్నింటికన్నా ముఖ్యం. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాం. ఆతిథ్య దేశాల అధికారులతో కలిసి పనిచేస్తున్నాం’’ అని పేర్కొంది.
బంగ్లాతో నాలుగో టీ20 భారత్దే
సిల్హెట్: భారత మహిళల జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ను నాలుగో టీ20లోనూ ఓడించి అయిదు మ్యాచ్ల సిరీస్లో 4-0 ఆధిక్యం సంపాదించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ విధానంలో 56 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం వల్ల ఇన్నింగ్స్ను 14 ఓవర్లకు కుదించగా.. మొదట భారత్ 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (39; 26 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. రిచా ఘోష్ (24; 15 బంతుల్లో 3×4, 1×6) రాణించింది. లక్ష్యాన్ని 125 పరుగులకు సవరించగా.. బంగ్లా 7 వికెట్లకు 68 పరుగులే చేయగలిగింది. దీప్తి శర్మ (2/13), ఆషా శోభన (2/18) ఆ జట్టును దెబ్బతీశారు.
ప్రపంచ నం.2కు మనిక షాక్
కేఏఈసీ (సౌదీ అరేబియా): సౌదీ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ మనిక బత్రా సంచలన విజయం సాధించింది. సోమవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మనిక 6-11, 11-5, 11-7, 12-10తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ మన్యూ (చైనా)కు షాక్ ఇచ్చి ప్రిక్వార్టర్స్ చేరింది. మరోవైపు ఆకుల శ్రీజ 7-11, 11-3, 11-9, 12-14తో జెనీ సహో (పోర్చుగల్) చేతిలో ఓడింది.
భారత్ పసిడి పాంచ్
అస్తానా (కజకిస్థాన్): ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బాక్సర్లు అయిదు స్వర్ణాలు సాధించారు. బ్రిజేశ్ (48 కేజీలు), ఆర్యన్ హుడా (51 కేజీలు), యశ్వర్దన్ (63.5 కేజీలు), లక్ష్మీ (50 కేజీలు), నిషా (52 కేజీలు) ఫైనల్లో విజయాలు నమోదు చేశారు.
గంభీర్ కోరుకున్నట్లు..
లఖ్నవూ: మెంటర్ గౌతమ్ గంభీర్ గెలుపు నమూనాను అనుసరించడం వల్ల కోల్కతా మంచి ఫలితాలు రాబడుతోందని ఆ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. ఈ సీజన్లో అదరగొడుతోన్న కోల్కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గంభీర్ నాయకత్వం (2011-2017)లో నైట్రైడర్స్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. మొత్తం అయిదుసార్లు ప్లేఆఫ్స్కు చేరుకుంది. కానీ గత ఏడేళ్లలో రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్లో అడుగుపెట్టగలిగింది. ఈ ఏడాది మెంటర్గా గంభీర్ కోల్కతాకు తిరిగి రావడంతో ఆ జట్టు దూసుకుపోతోంది. ఆదివారం లఖ్నవూపై 98 పరుగుల విజయంతో 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. ‘‘ఈ మ్యాచ్లోనే కాదు.. ఈ సీజనంతా గౌతమ్ గంభీర్ కోరుకున్నట్లుగా ఆడుతున్నాం. మ్యాచ్లను ఎలా మనవైపు తిప్పుకోవాలనే విషయంలో అతడికి చాలా పరిజ్ఞానం ఉంది. అది మాకు ఎంతో ఉపయోగపడుతోంది. కేకేఆర్ పిచ్ను బాగా అర్థం చేసుకుంటుంది. మేం సరైన ప్రాంతాల్లో బంతులేశాం’’ అని మ్యాచ్ అనంతరం రాణా వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..