‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది.
రిలేలో ఒలింపిక్స్కు భారత మహిళల బృందం
పురుషుల రిలే జట్టు కూడా
నాసు (బహమాస్)
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. చిరుత వేగంతో పరుగెత్తి భారత్ను రేసులో నిలిపింది. జ్యోతిక అందించిన ఆధిక్యాన్ని పూవమ్మ, శుభ కొనసాగించడంతో రాణించడంతో 4×400 మీటర్ల రిలేలో భారత్ ద్వితీయ స్థానంతో రేసును పూర్తి చేసి ఒలింపిక్స్ బెర్తు పట్టేసింది. పురుషుల విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం విశేషం.
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ సత్తా చాటింది. మహిళల 4×400 మీటర్ల రిలేలో అదరగొట్టి జట్టు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు తోడ్పడింది. సోమవారం బహమాస్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే రెండో అర్హత టోర్నీలో జ్యోతికశ్రీ, రూపల్ చౌదరి, పూవమ్మ, శుభ వెంకటేశన్లతో కూడిన బృందం హీట్-1లో 3 నిమిషాల 29.35 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. జమైకా (3 నిమిషాల 28.54 సె) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హీట్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే పారిస్ బెర్తు దక్కించుకునే నేపథ్యంలో రేసు ఉత్కంఠభరితంగా ఆరంభమైంది. తొలి 400 మీటర్లలో భారత్ అమ్మాయి రూపల్ ప్రత్యర్థులతో సరితూగలేకపోయింది. అయిదో స్థానానికి పరిమితమై బ్యాటన్ను జ్యోతికి అందించింది. శక్తినంతా కూడదీసుకుంటూ తెలుగమ్మాయి దూసుకెళ్లింది. తడబాటు లేకుండా లెగ్ను రెండో స్థానంతో ముగించి బ్యాటన్ను పూవమ్మకు అందించింది. జ్యోతి ఇచ్చిన స్ఫూర్తితో మొదట పూవమ్మ.. ఆఖరి లెగ్లో శుభ మెరుపులా దూసుకెళ్లడంతో భారత్ రెండో స్థానంతో రేసు ముగించింది. దీంతో పారిస్ టికెట్ సొంతమైంది. తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్లో హీట్లో అయిదో స్థానంలో నిలిచిన భారత్.. రెండో ఈవెంట్లో శక్తికి మించి పోరాడి.. ఐరోపా అథ్లెట్ల పోటీని తట్టుకుని ఒలింపిక్స్కు అర్హత సాధించిన తీరు స్ఫూర్తిదాయకం. రియో ఒలింపిక్స్ తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్లో అమ్మాయిల బృందం బరిలో దిగబోతోంది. మొత్తంగా 1984 నుంచి 4×400 మీటర్ల రిలేలో భారత మహిళల జట్టు ఒలింపిక్స్లో పాల్గొనడం ఇది ఎనిమిదోసారి. పారిస్కు వెళ్లబోయే రిలే జట్టును భారత అథ్లెటిక్స్ సమాఖ్య తర్వాత ప్రకటిస్తుంది.
పురుషుల జట్టు మెరుపులా..: భారత పురుషుల రిలే జట్టు కూడా పారిస్ విమానం ఎక్కబోతోంది. 4×400 మీటర్ల పరుగులో మహ్మద్ అనాస్, మహ్మద్ అజ్మల్, రాజీవ్ అరోకియా, అజ్మల్ జాకబ్లతో కూడిన జట్టు 3 నిమిషాల 3.23 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్-1లో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా (2 నిమిషాల 59.95 సెకన్లు) అగ్రస్థానం సాధించింది. ఈ ఈవెంట్లో ఒలింపిక్స్లో పోటీపడడం పురుషుల జట్టుకు ఇది నాలుగోసారి. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో తొలిసారి బరిలో దిగింది. 4×400 మీ. రిలేలో పురుషులు, మహిళల జట్లు అర్హత సాధించడంతో పారిస్లో ట్రాక్ అండ్ ఫీల్డ్లో పోటీపడే భారత అథ్లెట్ల సంఖ్య 19కి చేరింది.
‘‘ఒలింపిక్స్కు అర్హత సాధించడం పెద్ద ఘనత. తొలి అంచె ఈవెంట్లో ఓడినా.. రెండో అంచెలో కచ్చితంగా గెలుస్తామని మా జట్టు నమ్మింది. మొదట లెగ్లో రూపల్ వెనుకబడినప్పుడు.. రెండో లెగ్లో పరుగెత్తిన నాకు కాస్త ఒత్తిడిగా అనిపించింది. కానీ సవాల్గా తీసుకున్నా. ఈ రేసు ఒలింపిక్స్కు చివరి అవకాశం కావడంతో.. పట్టుదలగా వేగంగా పరుగెత్తాను. జమైకా అథ్లెట్ను అధిగమించాలనుకున్నా కానీ కుదర్లేదు. మా జట్టులోని మిగతా సభ్యులూ రాణించడంతో జట్టు ఒలింపిక్స్కు అర్హత పొందింది. అక్కడ పోటీ చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఆఖరిదాకా పోరాడతాం’’
‘ఈనాడు’తో జ్యోతి
తెలుగు మెరుపు
4×400 మీటర్ల పరుగులో భారత మహిళల జట్టు పారిస్ ఒలింపిక్స్కు బెర్తు సాధించడంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీది పశ్చిమగోదావరి జిల్లా తణుకు. ఛాంపియన్ అథ్లెట్ కావాలన్నదే ఆమె చిన్ననాటి లక్ష్యం. నాన్న దండి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో రన్నర్గా ఎదిగిన 23 ఏళ్ల జ్యోతి.. 400 మీటర్ల పరుగులో సత్తా చాటుతోంది. ఇంట్లో ఇద్దరు అమ్మాయిల్లో చిన్నదైన ఆమె.. చిన్నప్పుడు ఒక పరుగు పందెం చూసి స్ఫూర్తి పొందింది. తాను అథ్లెట్ కావాలని భావించింది. స్వతహాగా క్రీడాకారుడే అయిన నాన్న కూడా అండగా నిలవడంతో జ్యోతి కెరీర్కు పునాది పడింది. 2016-2020 వరకు సాయ్ కోచ్ వినాయక్ ప్రసాద్ శిక్షణలో ఆమె పరుగుపై పట్టు సంపాదించింది. ఆ తర్వాత హైదరాబాద్లో గోపీచంద్ మైత్రా అథ్లెటిక్స్ ప్రాజెక్ట్లో భాగంగా కోచ్ నాగపురి రమేశ్ దగ్గర శిక్షణ పొంది రాటుదేలింది.
‘ఈనాడు’ లక్ష్య సాయంతో..: 2017 ప్రపంచ యూత్ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో 4×400 మీ పరుగులో పాల్గొన్న ఈ తెలుగమ్మాయి.. 2021లో అండర్-23 మహిళల 400 మీ. పరుగులో జాతీయ ఛాంపియన్గా నిలిచింది. 2022 జాతీయ క్రీడల్లోనూ రజతం సాధించింది. గతేడాది నుంచి ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ తోడ్పాటుతో మరింత మెరుగైన అథ్లెట్గా మారింది. ఉత్తమ శిక్షణ అందడంతో అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్న జ్యోతి.. 2023 ఇండియన్ గ్రాండ్ప్రి 2, 4 అంచె టోర్నీల్లో స్వర్ణాలతో మెరిసింది. నిరుడు ఆసియా ఛాంపియన్షిప్లో భారత్ 4×400 మీటర్ల పరుగులో కాంస్యం గెలవడంలో కీలకపాత్ర పోషించింది. 400 మీటర్ల పరుగులో జ్యోతి అత్యుత్తమ టైమింగ్ 53.05 సెకన్లు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల సమయంలో గాయం కావడంతో ఆమె పరుగుకు దూరమైంది. కోలుకుని పునరాగమనంలో రిలే టీమ్లో కీలక సభ్యురాలిగా ఎదిగింది. ‘‘2021 నుంచి జ్యోతికకు శిక్షణ ఇస్తున్నాం. గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందినప్పుడే ఆమె కెరీర్లోనే అత్యుత్తమ టైమింగ్ సాధించింది. ఎక్కువ దూరం వేగంగా పరుగెత్తగలిగే సామర్థ్యం ఆమె సొంతం. అందుకే ప్రపంచ అథ్లెటిక్స్ రిలే ఈవెంట్లో భారత్ తొలి లెగ్లో వెనుకబడినా.. జ్యోతిక మళ్లీ ట్రాక్లో పెట్టగలిగింది. ఈనాడు సీఎస్ఆర్ లక్ష్య కార్యక్రమం ద్వారా ఎందరో జ్యోతిక లాంటి ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు’’ అని ఆమెకు శిక్షణ ఇచ్చిన సీనియర్ కోచ్ నాగపురి రమేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!