Delhi Capitals - IPL 2023: దిల్లీ ఎందుకిలా.. వరుస ఓటములకు కారణాలివేనా..?
దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఈ సీజన్లో వరుసగా ఐదో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలోనూ ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు.
ఇంటర్నెట్ డెస్క్ : జట్టు మొత్తం దిగ్గజాలు లేనప్పటికీ.. డగౌట్లో హేమాహేమీలైన మాజీలు ఉన్నారు. పరిస్థితిని అలవోకగా అంచనా వేయగల సమర్థులు. అంతే బలంగా వాటిని ఫిక్స్ చేయగలవారు కూడా. ఇదంతా దిల్లీ క్యాపిటల్స్ గురించే. ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా అదరగొడుతున్న దిల్లీ.. ఈసారి ఉసూరుమనిపిస్తోంది. అసలు వార్నర్ సేన పరాజయాల వెనుక కారణాలేంటి?
హెడ్ కోచ్గా రికీ పాంటింగ్ (Ricky Ponting), డైరెక్టర్గా సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) లాంటి దిగ్గజాలు.. కెప్టెన్గా డేవిడ్ వార్నర్ (David Warner) లాంటి సీనియర్ ఆటగాడు ఉన్నప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రావడం లేదు. గత సీజన్లలో వరుసగా ప్లేఆఫ్స్ వరకూ చేరి మంచి జట్టుగా పేరు తెచ్చుకున్న దిల్లీ (Delhi Capitals).. ఈ సీజన్ (IPL 2023)లో ఇప్పటివరకూ బోణీ కొట్టలేకపోయింది. ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. తొలి విజయం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఈ ఐపీఎల్లో మిగతా జట్లు బోణీ కొట్టి.. పాయింట్ల పట్టికలో ముందుకెళ్తోంటే.. దిల్లీ మాత్రం అన్ని విభాగాల్లో విఫలమవుతూ నైరాశ్యంలో కూరుకుపోయింది.
వార్నర్ ఒక్కడే..
గత ఏడాది చివర్లో రోడ్డు ప్రమాదానికి గురై ఈ ఐపీఎల్కు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అందుకు తగ్గట్టే ప్రతి మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకూ మొత్తం 228 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. అయితే అతడికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. టాప్ ఆర్డర్ కుప్పకూలుతుండటంతో వార్నర్ ఒక్కడే జట్టును గట్టెక్కించలేకపోతున్నాడు. ఇక ఆల్రౌండర్ మార్ష్ ఇప్పటివరకూ రాణించింది లేదు.
నిరాశపరుస్తున్న పృథ్వీ..
ఇక ఈ సీజన్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్ పృథ్వీ షా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. రెండు సార్లు డకౌట్ అయ్యాడు. మిగతా మ్యాచ్ల్లో చేసిన పరుగులు 12, 7, 15 మాత్రమే. ఈ గణాంకాలు చూస్తే అతడి ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. పదే పదే ఒకరకమైన షాట్లకు ప్రయత్నించి ఔట్ అవుతున్నప్పటికీ.. తప్పుల నుంచి ఏ మాత్రం నేర్చుకోవడం లేదు. అతడితో కలిసి ఆడిన సహచర ఆటగాడు శుభ్మన్ గిల్ అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతుంటే.. షా ఇంకా ఐపీఎల్లోనే ఇబ్బంది పడుతున్నాడు. అతడి ప్రదర్శనపై పలువురు మాజీలు విమర్శలు గుప్పించారు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాలని అతడికి సూచిస్తున్నారు.
అక్షర్ రాణిస్తున్నా..
బ్యాటింగ్ విభాగంలో వార్నర్ తర్వాత కాస్తాకూస్తో రాణిస్తున్నది ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మాత్రమే. ముంబయిపై అర్ద శతకాన్ని (54) నమోదు చేయగా.. గుజరాత్పై బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (36) ఆడాడు. అటు బంతితోనూ రాణిస్తున్నాడు. ఇక మనీశ్ పాండే బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అర్ద శతకం నమోదు చేసినప్పటికీ.. గత మ్యాచ్ల్లో పెద్దగా రాణించింది లేదు.
పంత్ లేని లోటు..
గత సీజన్లలో దిల్లీ వరుసగా ప్లేఆ ఫ్స్కు చేరిందంటే అందులో పంత్ పాత్ర కూడా ఉంది. మిడిల్ ఆర్డర్లో దూకుడుగా ఆడే పంత్.. జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. ఇప్పుడు అతడి లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి స్థానాన్ని భర్తీ చేసే వారు జట్టులో కరవయ్యారు.
విఫలమవుతున్న బౌలింగ్ యూనిట్..
ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, నోకియా, అక్షర్, ముస్తాఫిజర్, కుల్దీప్ యాదవ్ లాంటి వారితో బౌలింగ్ దళం పటిష్ఠంగానే కనిపిస్తున్నప్పటికీ.. ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ధారళంగా పరుగులు సమర్పిస్తూ జట్టును కాపాడలేకపోతున్నారు. పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్లపైనా తేలిపోవడం దిల్లీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
లోపిస్తున్న వ్యూహాలు..
దిల్లీ ఈ సీజన్లో పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తోంది. సరైన ప్రణాళికలతో ముందుకు రావడం లేదు. తమ ప్రణాళికలను అమలు పరచడంలో ఆ జట్టు పూర్తిగా గందరగోళానికి గురవుతోందని మాజీ కెప్టెన్ సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. గతంలో జట్టు ప్లేఆప్స్ వరకూ చేరేందుకు సహకరించిన పాంటింగ్, గంగూలీ.. ఈ సారి ఓటములకు బాధ్యత తీసుకోవాలని సూచించాడు. రాబోయే మ్యాచ్ల్లోనైనా సరైన ప్రణాళికలతో ముందుకు వచ్చి విజయాల బాట పట్టాలని కోరుతున్నాడు.
ప్రతి మ్యాచూ కీలకమే..
పది జట్లు ఆడే ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ కీలకమే అన్న సంగతి తెలిసిందే. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లే ఆఫ్స్కు చేరుతాయి. ఈ నేపథ్యంలో విజయాలతో పాటు నెట్ రన్రేట్ ఎంతో కీలకంగా మారుతుంది. ఇప్పటికే ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న దిల్లీ.. రేసులో నిలవాలంటే.. ఇక నుంచి ప్రతి మ్యాచ్లో విజయంతోపాటు మంచి రన్రేట్ను సాధించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ మద్దతుతో ఐపీఎల్లో శ్రీలంక పేసర్ పతిరన అదరగొట్టేస్తున్నాడు. యువ ‘మలింగ’గా పేరొందిన అతడు చెన్నై తరఫున ఆడుతూ రాటుదేలాడు. -
MS Dhoni: 103 ఏళ్ల అభిమానికి ఎమ్ఎస్ ధోనీ అపురూపమైన కానుక.. వీడియో
తన 103 ఏళ్ల అభిమానికి ఎమ్ఎస్ ధోనీ ఓ అపురూపమైన కానుక అందించారు. తాను స్వయంగా ఆటోగ్రాఫ్ పెట్టిన చెన్నై జెర్సీని.. ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఆ జెర్సీని అందుకున్న రాందాస్ ఎంతగానో మురిసిపోయారు. వీడియో మీరూ చూడండి.
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
ముంబయి వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. చివరి మూడు మ్యాచుల్లో గెలిచినా నాకౌట్ దశకు చేరుకోవడం కష్టమే. గెలుస్తామనుకున్న మ్యాచుల్లోనే ఓటమిపాలై అభిమానులను నిరాశకు గురి చేసింది. -
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ పొట్టి కప్ బరిలోకి దిగబోతున్నాడు. ఈసారైనా తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవాలంటే కీలకమైన మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. -
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు