SA vs IND: గిల్ ఇలాగే ఆడితే.. వారిద్దరిలో ఒకరు వచ్చేస్తారు: డీకే
టీమ్ఇండియాలోకి (Team India) వచ్చేందుకు విపరీతమైన పోటీ ఉంది. పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న శుభ్మన్ గిల్ కూడా పోటీ ఎదుర్కొంటున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ప్రదర్శన గత కొన్ని మ్యాచుల్లో గొప్పగా ఏమీ లేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులోనూ విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పుడా మ్యాచ్లోనూ.. ఆ తర్వాత వచ్చే సిరీసుల్లోనూ మంచి ప్రదర్శన ఇవ్వకపోతే ఇతర క్రికెటర్లు అతడి స్థానాన్ని భర్తీ చేసేస్తారని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు.
‘‘ఇప్పుడు శుభ్మన్ గిల్ స్థానమే ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడటంలో అతడు విఫలమవుతున్నాడు. 20 టెస్టుల తర్వాత కూడా సగటు 30కి అటూఇటుగా ఉంటే మాత్రం స్థానంపై పునరాలోచించుకోవాలి. అలాంటి సమయంలో అదృష్టం ఉంటేనే జట్టులో ఉండేందుకు అవకాశం ఉంది. ఈ సీజన్లో జరిగే టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే మాత్రం మేనేజ్మెంట్ దృష్టిసారించే అవకాశాలూ లేకపోలేదు. దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ భారీగా పరుగులు చేసి సిద్ధంగా ఉన్నారు. సర్ఫరాజ్ త్వరగా జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిలార్డర్లో రజత్ కూడా బలమైన పోటీదారు. అందుకే, గిల్ ఇకనుంచైనా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టాలి’’ అని డీకే విశ్లేషించాడు.
అశ్విన్ స్థానంలో జడేజాను ఆడించాలి: ఇర్ఫాన్ పఠాన్
రెండో టెస్టులో మార్పులు చేస్తే స్పిన్ ఆల్రౌండర్ను మాత్రమే మార్చాలని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ‘‘రవీంద్ర జడేజా ఫిట్గా ఉంటే అతడిని జట్టులోకి తీసుకోవాలి. తొలి టెస్టులో అశ్విన్ బాగానే బౌలింగ్ వేశాడు. కానీ, జడేజాలా బ్యాటింగ్లోనూ ఏడో స్థానంలో పరుగులు చేయలేకపోయాడు. సెంచూరియన్ టెస్టులో భారత్కు అదే లోటుగా మారింది. పేస్ విభాగంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ప్రసిధ్కు బదులు ముకేశ్ కుమార్ను తీసుకోవాలని చాలా మంది చెబుతున్నారు. కానీ నెట్స్లో, మ్యాచ్లోనూ ప్రసిధ్ ఆత్మవిశ్వాసంతోనే బౌలింగ్ చేశాడు’’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..