ENG vs BAN: ఇంగ్లాండ్‌ చేతిలో బంగ్లా చిత్తు.. 137 పరుగుల తేడాతో విజయం

ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ 137పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 10 Oct 2023 18:51 IST

ధర్మశాల: బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌ రౌండర్‌ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్‌.. 137 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్ మలన్ (140; 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. జో రూట్ (82; 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించాడు. బెయిర్‌స్టో (52; 59 బంతుల్లో 8×4) అర్ధశతకం సాధించాడు. 

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 48.2 ఓవర్లలో కేవలం 227 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (76; 66 బంతుల్లో 7×4, 2×6), ముష్ఫికర్‌ రహీమ్‌ (51; 64 బంతుల్లో 4×4) పోరాడినా ఫలితం లేకపోయింది. మిగతావారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రీస్‌ టాప్లే 4 వికెట్లు పడగొట్టగా.. వోక్స్‌ 2 వికెట్లు తీశాడు. సామ్‌కరన్‌, మార్క్‌వుడ్‌, అదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని