ENG vs BAN: ఇంగ్లాండ్ చేతిలో బంగ్లా చిత్తు.. 137 పరుగుల తేడాతో విజయం
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఇంగ్లాండ్ 137పరుగుల తేడాతో విజయం సాధించింది.
ధర్మశాల: బంగ్లాదేశ్పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్.. 137 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (140; 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. జో రూట్ (82; 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. బెయిర్స్టో (52; 59 బంతుల్లో 8×4) అర్ధశతకం సాధించాడు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో కేవలం 227 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఓపెనర్ లిటన్ దాస్ (76; 66 బంతుల్లో 7×4, 2×6), ముష్ఫికర్ రహీమ్ (51; 64 బంతుల్లో 4×4) పోరాడినా ఫలితం లేకపోయింది. మిగతావారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టాప్లే 4 వికెట్లు పడగొట్టగా.. వోక్స్ 2 వికెట్లు తీశాడు. సామ్కరన్, మార్క్వుడ్, అదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా