IND vs BAN: చెలరేగిన బౌలర్లు.. తొలి టెస్టులో బంగ్లాపై భారత్‌ అద్భుత విజయం

తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించింది. చివరి రోజు నాలుగు వికెట్లు అవసరం కాగా.. కేవలం యాభై నిమిషాల్లోనే బంగ్లాను ఆలౌట్‌ చేసి గెలిచింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Updated : 18 Dec 2022 15:50 IST

ఇంటర్నెట్ డెస్క్: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య  ఛేదనలో బంగ్లాదేశ్‌ 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 188 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లా 150కు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరుకు డిక్లేర్డ్‌ చేసింది. ఐదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోపే బంగ్లాదేశ్‌ కేవలం 52 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను అక్షర్ పటేల్ (4/77), కుల్‌దీప్‌ యాదవ్ (3/73) కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్‌ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కుల్‌దీప్‌ యాదవ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.


స్వల్ప వ్యవధిలో వికెట్లు

భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఐదో రోజు ఆట ప్రారంభమైంది. 272/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు మూడో ఓవర్‌లోనే సిరాజ్‌ షాక్‌ ఇచ్చాడు. మెహిదీ హసన్ (13)ను సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. అయితే, మరోవైపు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (84) దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేశాడు. కానీ, కుల్‌దీప్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 111 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి మరో రెండు వికెట్లు  అవసరం కాగా.. బంగ్లాదేశ్‌ 193 పరుగులు చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని