SA vs IND: ఇలాంటప్పుడు అజింక్య రహానె ఉండుంటే.. : గావస్కర్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడ్డారు. కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (17) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రోహిత్ శర్మ (5), గిల్ (2) విఫలమయ్యారు. విరాట్ (38), శ్రేయస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. కానీ, వీరంతా కీలక సమయంలో వికెట్ను చేజార్చుకోవడంతో భారత్కు కష్టాలు తప్పలేదు. ఇలాంటి సమయంలో అజింక్య రహానె వంటి నిలకడైన ఆటగాడు ఉంటే బాగుండేదని టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 2018 పర్యటనలో జోహన్నెస్బర్గ్ టెస్టులో రహానె ఇన్నింగ్స్ను సన్నీ గుర్తు చేసుకున్నాడు.
‘‘ఐదేళ్ల క్రితం జోహన్నెస్బర్గ్ పిచ్ గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అక్కడే ఉన్నా. ఇప్పటి సెంచూరియన్ పిచ్ మాదిరిగానే జోహన్నెస్బర్గ్ కూడా బ్యాటింగ్కు చాలా క్లిష్టంగా ఉంది. అయితే, అజింక్య రెండో ఇన్నింగ్స్లో ఆడిన తీరు అద్భుతం. ఆ పర్యటనలో తొలి రెండు టెస్టుల్లో రహానెకు అవకాశం కల్పించలేదు. ఆ మ్యాచుల్లో భారత్ స్వల్ప తేడాతోనే ఓటమిని చవిచూసింది. చివరి టెస్టులో పుంజుకుని మరీ విజయం సాధించింది. విదేశీ పిచ్లపై రహానె అనుభవం ఉపయోగపడుతుంది. అతడి గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. ఒక వేళ ఇప్పుడు రహానె ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు. అప్పట్లో మూడో టెస్టులో రహానె తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో 48 పరుగులు చేశాడు.
ఈ పరిస్థితుల్లో భారత్ బాగానే ఆడింది
మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 200 స్కోర్ను దాటడంపై సునీల్ గావస్కర్ స్పందించాడు. కఠినమైన పిచ్పై టీమ్ఇండియా మెరుగ్గానే ఆడిందని వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పటి వరకైతే భారత్ అద్భుతంగానే ఆడింది. బ్యాటింగ్కు కఠినమైన పిచ్పై 200+ పరుగులు చేయడం గొప్పే. టీమ్ఇండియా ఈ ఏడాదిని విజయంతో ముగించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుందని భావిస్తున్నా. దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెద్దగా ఫామ్లో లేరు. వారిని త్వరగా ఆలౌట్ చేస్తే మనకు తిరుగుండదు. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో కాస్త నిలదొక్కుకుని పరుగులు చేస్తే విజయం కష్టమేమీ కాదు’’ అని సునీల్ గావస్కర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!