Rachin Ravindra: న్యూజిలాండ్ నుంచి అనుకోని హీరో..
ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ జరిగింది ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అయినా.. అందులో భారత్తో సంబంధం ఉన్న కుర్రాడు హీరోగా నిలిచాడు. అతనే.. రచిన్ రవీంద్ర
ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ జరిగింది ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అయినా.. అందులో భారత్తో సంబంధం ఉన్న కుర్రాడు హీరోగా నిలిచాడు. అతనే.. రచిన్ రవీంద్ర. ఈ కుర్రాడు భారతీయుడు కాదు కానీ.. భారత సంతతికి చెందిన కుర్రాడే. రచిన్ కుటుంబం అతను పుట్టడానికి ముందే న్యూజిలాండ్లో స్థిరపడింది. అతను రెండేళ్ల కిందట, 21 ఏళ్ల వయసులోనే న్యూజిలాండ్ టీ20 జట్టులోకి వచ్చాడు. తర్వాత టెస్టు, వన్డే జట్లలోనూ చోటు సంపాదించాడు. రచిన్ నిజానికి ప్రపంచకప్లో ఆడాల్సిందే కాదు. అతను సెలక్టర్ల దృష్టిలోనే లేడు. కానీ స్పిన్ ఆల్రౌండర్ బ్రాస్వెల్ గాయపడి ప్రపంచకప్కు దూరం కావడంతో అనుకోకుండా రచిన్కు అవకాశం వచ్చింది. రచిన్ ప్రధానంగా స్పిన్నరే. లోయర్ మిడిలార్డర్లో అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. అయితే పాకిస్థాన్తో వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా పంపితే అతనే 97 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రపంచకప్ మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిస్తే.. ఆ వ్యూహం అద్భుతంగా పని చేసింది. సంచలన ఇన్నింగ్స్తో అతను ఇంగ్లాండ్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. అనుకోకుండా ప్రపంచకప్లోకి వచ్చిన రచిన్.. తొలి మ్యాచ్లోనూ అనుకోని హీరోగా నిలిచాడు.
వన్డే చరిత్రలో తొలిసారి..
వన్డే క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన రికార్డు 2023 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో నమోదైంది. ఒక జట్టులో 11 మంది ఆటగాళ్లూ రెండంకెల స్కోర్లు నమోదు చేయడం గురువారమే జరిగింది. ఇంగ్లాండ్ జట్టులో ప్రతి ఆటగాడు పది దాటాడు. అత్యధికంగా రూట్ 77 పరుగులు సాధిస్తే.. మొయిన్ అలీ, వోక్స్ అత్యల్పంగా 11 చొప్పున పరుగులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.