Virat Kohli: విరాట్కు 23 టెస్టుల నుంచి సెంచరీ లేదు.. ఐస్ల్యాండ్ క్రికెట్పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్
టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల కాలంలో వరుసపెట్టి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కానీ, టెస్టుల్లో మాత్రం సెంచరీ కోసం నిరీక్షణ తప్పడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవలే 25వేల పరుగులు సాధించాడు. అత్యంత తక్కువ మ్యాచుల్లోనే ఇలాంటి ఘనత సాధించిన బ్యాటర్గా మారాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. అదీనూ టీ20ల్లో కావడం విశేషం. ఇటీవల వన్డేలోనూ శతక నిరీక్షణకు తెరదించాడు. కానీ, టెస్టుల్లో మాత్రం సెంచరీ సాధించి మూడున్నరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్పై సెంచరీ సాధించాడు. దాదాపు 23 టెస్టుల నుంచి ఒక్క శతకం నమోదు కాలేదు. దక్షిణాఫ్రికాపై చేసిన 79 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. తాజాగా ఆసీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ 44, 20, 12 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ఐస్ల్యాండ్ క్రికెట్ పెట్టిన ఓ ట్వీట్ మాత్రం ట్వీట్ వైరల్గా మారింది. విరాట్ అభిమానులకు మాత్రం రుచించడం లేదు. ఇంతకీ ఏమైందంటే..?
విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లవుతోంది. ఈ క్రమంలో ఐస్ల్యాండ్ క్రికెట్ ‘‘విరాట్ కోహ్లీ గురించి ఇప్పుడు చెప్పే గణాంకాలు చాలామంది భారత అభిమానులకు నచ్చకపోవచ్చు. అయితే, విరాట్ కోహ్లీ సుదీర్ఘఫార్మాట్లో సెంచరీ సాధించి 23 టెస్టులు అయ్యాయి. చివరిసారిగా 2019లో సాధించాడు. ఇది చాలా సుదీర్ఘ కాలం..’’ అని ట్వీట్ చేసింది. దీంతో విరాట్ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా పలు కామెంట్లు పెట్టారు.
‘‘అదేం కాదు. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. ఎందుకంటే 2020 నుంచి 2021 మధ్య వరకు కొవిడ్ కారణంగా పెద్దగా మ్యాచ్లే జరగలేదు. ఇప్పటి వరకు భారీగా సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ కనీసం మరో సంవత్సరం సమయం ఇవ్వాలి’’
‘‘విరాట్ ఒక్కో ఫార్మాట్లో ఫామ్ను అందిపుచ్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో సెంచరీలు బాదాడు. స్పిన్ కీలక పాత్ర పోషించిన టెస్టుల్లోనూ 44 (83), 21 (30) నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాడు’’
‘‘కేవలం సెంచరీలు చేసినంత మాత్రనా ఆటగాడిని అత్యుత్తమ బ్యాటర్గా పరిగణించలేం. స్థిరంగా పరుగులు రాబట్టాలి. శతకం చేయకపోయినా, మ్యాచ్లో అతడి చేసిన రన్స్ కీలకమైతే చాలు. కోహ్లీ గత కొన్ని మ్యాచుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర