Sunil Gavaskar : భువీకి మళ్లీ జట్టులో చోటు దక్కడం కష్టమే.! : సునీల్ గావస్కర్
టీమ్ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అతడికి మళ్లీ భారత జట్టులో చోటు దక్కడం కష్టమేనని...
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అతడికి మళ్లీ భారత జట్టులో చోటు దక్కడం కష్టమేనని అన్నాడు. రానున్న రెండు ప్రపంచకప్ల దృష్ట్యా భారత జట్టు యాజమాన్యం నాణ్యమైన ఆటగాళ్లను వెలికి తీయాల్సిన అవసరముందని సూచించాడు. సమయం తక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా టీ20, వన్డే ఫార్మాట్లలో సత్తా చాటగల క్రికెటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించాడు. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్, 2023 అక్టోబరులో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వీటిలో వన్డే ప్రపంచకప్ స్వదేశంలో జరుగనుండటంతో సహజంగానే భారత్పై భారీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాలంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ సత్తా చాటగల క్రికెటర్లను ఎంపిక చేసుకోవాలని గావస్కర్ సూచించాడు.
‘యువ బౌలర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో.. రానున్న ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్ కుమార్కి చోటు దక్కడం కష్టమేననిపిస్తోంది. అతడి బౌలింగ్లో మునుపటి పదును, కచ్చితత్వం కనిపించడం లేదు. అలా అని గతంలో భువీ టీమ్ఇండియాకు అందించిన సేవలను తక్కువ అంచనా వేయలేం. గత కొద్దికాలంగా ఫామ్పరంగా అతడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అవకాశమొచ్చిన మ్యాచుల్లో కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యార్కర్లు, స్లో డెలివరీలతో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు అతడి బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. అందుకే, అతడు కొంత కాలం విరామం తీసుకుని బౌలింగ్పై దృష్టి పెడితే బాగుంటుంది. ప్రస్తుతానికైతే భువనేశ్వర్ స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్ని వెతకాల్సిన సమయం ఆసన్నమైందనుకుంటున్నాను. అతడి స్థానంలో యువ ఆటగాడు దీపక్ చాహర్కి మరిన్ని అవకాశాలిచ్చి.. మెరుగైన బౌలర్గా తీర్చిదిద్దాలి. అతడు బంతితో పాటు, బ్యాటుతోనూ సత్తా చాటగలడు’ అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో దీపక్ చాహర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం చాలా మంది యువ ఆటగాళ్లు వేచి చూస్తున్నారు. భారత బ్యాటింగ్ విభాగం కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా.. పేస్ బౌలింగ్ విషయంలోనే సెలెక్టర్లు కొంత సందిగ్థంలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. కానీ, వారికి మద్దతుగా నిలిచే మూడో బౌలర్గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్థానం కోసం యువ బౌలర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్లు పోటీ పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం