IPL 2023: ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నా.. కానీ ఛాంపియన్గా నిలిచేది ఆ జట్టే: ఏబీడీ
ఐపీఎల్ 2023 సీజన్లో ఏ జట్టు ఛాంపియన్గా నిలవబోతోందో అంచనా వేస్తూ ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సొంత జట్టు ఆర్సీబీని పక్కన పెట్టి మరో జట్టు విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. ఇంతకీ ఆ జట్టు ఏదో తెలుసుకుందామా?
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16(IPL) రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు నువ్వానేనా అంటూ పోటీపడుతున్నాయి. దీంతో ఐపీఎల్ 2023 సీజన్ విజేత ఎవరో అన్న అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(AB De Veilliers) ప్రస్తుత సీజన్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో అంచనా వేసేశాడు. తనకు ఆర్సీబీ గెలవాలని ఉన్నా.. హార్ధిక్ పాండ్య సారథ్యం వహిస్తున్న గుజరాత్ టైటన్స్(GT) జట్టు ఛాంపియన్గా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సీజన్లో ఏ జట్టు ఛాంపియన్గా నిలుస్తుందని ఏబీడీని ప్రశ్నించగా..‘‘చాలా కష్టమైన ప్రశ్న. చాలా రోజుల క్రితం ఐపీఎల్ వేలం సమయంలో..ఈసారి కూడా గుజరాత్ టైటన్స్ విజయ దుందుభి మోగిస్తుందని చెప్పాను. నిజంగా నేను ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నప్పటికీ అప్పుడు చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటాను. గతేడాది నుంచి జీటీ గొప్ప జట్టును కలిగి ఉంది. మంచి బాలెన్స్, తగినంత శక్తితో ఆ జట్టు బలంగా ఉంది. ఆర్సీబీ కూడా అన్నివిధాలా రాణిస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపాడు.
గతేడాది ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటన్స్ ప్రస్తుత సీజన్లోనూ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లోనే ముంబయిపై ఘనవిజయం సాధించిన ఆర్సీబీ నేడు కోల్కతాతో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ