హిట్మ్యాన్ షో!
ఓపెనర్ రోహిత్ శర్మ (161; 231 బంతుల్లో, 18×4, 2×6) భారీ శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో...
తొలి రోజు ఆటలో భారత్ 300/6
ఇంటర్నెట్డెస్క్: ఓపెనర్ రోహిత్ శర్మ (161; 231 బంతుల్లో, 18×4, 2×6) భారీ శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (67; 149 బంతుల్లో, 9×4) అర్ధశతకంతో రాణించాడు. క్రీజులో రిషభ్ పంత్ (33*, 56 బంతుల్లో, 5×4, 1×6), అక్షర్ పటేల్ (5*, 7 బంతుల్లో, 1×4) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్, మొయిన్ అలీ చెరో రెండు, స్టోన్, రూట్ తలో వికెట్ తీశారు.
గిల్, కోహ్లీ డకౌట్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే షాక్! ఖాతా తెరవకముందే శుభ్మన్ గిల్ను స్టోన్ ఔట్ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన యువఓపెనర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే వన్డౌన్లో వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నా దూకుడుగా పరుగులు సాధించాడు. 47 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు.
మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో పుజారా (21; 58 బంతుల్లో, 2×6), విరాట్ కోహ్లీ (0)ని పెవిలియన్కు చేర్చారు. లీచ్ బౌలింగ్లో పుజారా స్లిప్లో ఉన్న స్టోక్స్కు దొరకగా, కోహ్లీని అలీ బౌల్డ్ చేశాడు. దీంతో లంచ్ విరామానికి టీమిండియా 106/3తో నిలిచింది.
రెండో సెషన్లో పూర్తి ఆధిపత్యం
పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో టీమిండియా మరోసారి తక్కువ స్కోరుకు వెనుదిరుగుతుందేమోనని భావించారంతా. కానీ హిట్మ్యాన్ షోకు రహానె క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో భారత్ పట్టుబిగించింది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు 162 పరుగులు జోడించారు. రెండో సెషన్లో వికెట్ కోల్పోకుండా సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో రోహిత్ శతకం అందుకున్నాడు. 130 బంతుల్లో సాధించాడు. రహానె కూడా 104 బంతుల్లో అర్ధశతకం సాధించడంతో టీ విరామానికి భారత్ 189/3తో మంచి స్థితిలో నిలిచింది.
చివరి సెషన్లో 3 వికెట్లు
అనంతరం ఆఖరి సెషన్లోనూ రోహిత్, రహానె జోరు తగ్గలేదు. లైన్ అండ్ లెంగ్త్ బంతుల్ని గౌరవిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. రోహిత్ 208 బంతుల్లో 150 మార్క్ను అందుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. లీచ్ బౌలింగ్లో భారీషాట్కు యత్నించి హిట్మ్యాన్ ఔటవ్వగా.. తర్వాతి ఓవర్లోనే రహానెను అలీ బౌల్డ్ చేశాడు. దీంతో 249 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్, అశ్విన్ దూకుడుగా పరుగులు సాధించారు. పంత్ ధనాధన్ షాట్లతో అలరించాడు. అయితే ఆట ఆఖరిలో అశ్విన్ (13; 19 బంతుల్లో, 1×4) ను రూట్ ఔట్ చేశాడు.
తొలి రోజు ఆటలో హిట్మ్యాన్ ఇన్నింగ్స్ హైలైట్. పిచ్ సహకారంతో ఇంగ్లాండ్ బౌలర్లు అదనపు బౌన్స్, టర్న్తో వికెట్లు సాధిస్తునా.. మరోవైపు రోహిత్ మాత్రం ముచ్చటైన షాట్లు ఆడాడు. లాఫ్టెడ్, స్వీప్ షాట్లతో పరుగులు రాబట్టాడు. కరోనా విరామం తర్వాత తొలిసారి స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాడు. విమర్శకులకు సమాధానం చెబుతూ శతకం సాధించాడు. టెస్టుల్లో అతడికిది ఏడో సెంచరీ. అన్ని శతకాలు స్వదేశంలోనే సాధించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం