IND vs PAK: పాక్ బౌలింగ్ X భారత బ్యాటింగ్.. కేఎల్ మిస్ కావడం బ్యాడ్ న్యూసే.. భార్యతో బుమ్రా ఫుట్బాల్!
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో ఆసియా కప్లో (Asia Cup 2023) భాగంగా పాకిస్థాన్తో తలపడేందుకు టీమ్ఇండియా (IND vs PAK) సిద్ధమవుతోంది. అయితే, భారత బ్యాటింగ్కు, పాక్ బౌలింగ్కు మధ్య పోటీ ఉంటుందని ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. అలాగే తొలి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరం కావడం టీమ్ఇండియాకు బ్యాడ్ న్యూసేనని మహమ్మద్ కైఫ్ తెలిపాడు. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ ఆడేందుకు సమయం ఉండటంతో సరదాగా సతీమణితో కలిసి బుమ్రా ఫిఫా ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
కోహ్లీని త్వరగా కట్టడి చేస్తేనే..: బ్రాడ్ హాగ్
‘‘భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్నా. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్కు టీమ్ఇండియా బ్యాటింగ్కు మధ్య తీవ్ర పోటీ ఉండటం ఖాయం. అందుకే ఇలాంటి మ్యాచ్ను తప్పకుండా చూస్తా. పాక్ బౌలింగ్ అత్యుత్తమ స్థాయిలో ఉంది. మరోవైపు భారత జట్టులో స్టార్ బ్యాటర్లు ఉన్నారు. అయితే, పాక్ తరఫున ఎడమచేతివాటం పేసర్ షహీన్ షా అఫ్రిది మంచి ఫామ్లో ఉన్నాడు. నాణ్యమైన బౌలర్ను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు. స్వింగ్తోపాటు వేగంగా బంతులను సంధించే ఎడమచేతివాటం బౌలర్లను ఎదుర్కోవడం కుడిచేతివాటం బ్యాటర్లకు ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా భారత టాప్ ఆర్డర్ - షహీన్ బౌలింగ్కు మధ్యే పోటీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ అతడి బౌలింగ్ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారనుంది. అయితే, పాక్ త్వరగా విరాట్ కోహ్లీని కట్టడి చేయకపోతే మాత్రం భారీ నష్టం అనుభవించాల్సి వస్తుంది’’ అని బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు.
ఐదో స్థానంలో అతడి గణాంకాలు ఘనం: కైఫ్
దాయాది జట్టుతో పోరు ఉందనగా భారత క్రికెట్ అభిమానులకు షాకిస్తూ కేఎల్ రాహుల్ రెండు మ్యాచ్లకు దూరమవుతాడని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. ఫిట్గా లేకపోతే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్నలు వచ్చాయి. కేఎల్ రాహుల్ మిస్ కావడంపై భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ స్పందించాడు. ‘‘కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్లకు దూరమవుతున్నాడు. అయితే, ఈ టోర్నీలో మిగతా మ్యాచ్లకూ అందుబాటులో ఉండటం కష్టమేననిపిస్తోంది. అందుకే టీమ్ఇండియాకు ఇది బ్యాడ్ న్యూస్ అవుతోంది. కేఎల్ రాహుల్కు ఐదో స్థానంలో ఉత్తమ గణాంకాలు ఉన్నాయి. తప్పకుండా అక్కడ రాణిస్తాడనే నమ్మకం ఉండేది. ఇన్నింగ్స్లో నిలకడ తీసుకురావడంతోపాటు అవసరమైన సందర్భంలో భారీ షాట్లు కొట్టగలడు. కానీ, ఇప్పుడు అతడు లేకపోవడం మాత్రం భారత్కు నష్టమే. ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ.. కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే’’ అని కైఫ్ తెలిపాడు.
సతీమణితో సరదాగా వీడియోగేమ్..
ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్తో దాదాపు సంవత్సరం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆసియా కప్లో పాకిస్థాన్తో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కాస్త వ్యవధి దొరకడంతో తన సతీమణి సంజనా గణేశన్తో కలిసి ఫిఫా ఆన్లైన్ ఫుట్బాల్ గేమ్ను ఆడాడు. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..