IND vs SA: అదరగొట్టిన రాహుల్-సూర్య.. దక్షిణాఫ్రికా చిత్తు
భారత్ అదరగొట్టేసింది. మొన్న ఆసీస్ను మట్టికరిపించి ఊపు మీద.. తాజాగా దక్షిణాఫ్రికానూ చిత్తు చేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా...
తిరువనంతపురం: భారత్ అదరగొట్టేసింది. మొన్న ఆసీస్ను మట్టికరిపించి ఊపు మీద ఉన్న టీమ్ఇండియా తాజాగా సఫారీలను చిత్తు చేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవరల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో 110 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ (3) విఫలమయ్యాడు. అయితే ఆ ప్రభావం భారత ఇన్నింగ్స్పై పడకుండా కేఎల్ రాహుల్ (51*), సూర్యకుమార్ (50*) అర్ధ శతకాలతో అదరగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి 93 పరుగులను జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, నోకియా చెరో వికెట్ తీశారు. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
తొలి 15 బంతుల్లో ఐదు వికెట్లు..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొన్న భారత్కు బౌలర్లు అద్భుత ఆరంభం ఇచ్చారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ను పేకమేడలా కూల్చారు. తొలి ఓవర్లో ఆ జట్టు కెప్టెన్ బవుమా (0)ను దీపక్ చాహర్ క్లీన్ బౌల్డ్ చేసి వికెట్ల పతనానికి తెర లేపగా.. తర్వాతి ఓవర్లో అర్ష్దీప్ రెచ్చిపోయాడు. ఏకంగా మూడు వికెట్లను తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రసోసౌ (0), డికాక్ (1), మిల్లర్ (0)ను పెవిలియన్కు చేర్చాడు. తర్వాత మళ్లీ దీపక్ చాహర్ ట్రిస్టన్ స్టబ్స్ (0)ను ఔట్ చేశాడు. దీంతో మొత్తం 15 బంతుల్లోనే భారత బౌలర్లు దక్షిణాఫ్రికాకు చెందిన ఐదు వికెట్లను పడగొట్టడం విశేషం. మార్క్రమ్ (25), పార్నెల్ (24) కాస్త కుదురుకొని దక్షిణాఫ్రికా స్కోరు బోర్డున నడిపించారు. అయితే దక్షిణాఫ్రికా స్కోరు వంద దాటడానికి ప్రధాన కారణం.. కేశవ్ మహరాజ్ (41). ఓ వైపు వికెట్లు పడినా.. ఓర్పుగా ఆడిన మహరాజ్ చూడచక్కని షాట్లతో అలరించాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఇతడే టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, దీపక్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఆశ్విన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం ఎనిమిది పరుగులు ఇవ్వడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ మద్దతుతో ఐపీఎల్లో శ్రీలంక పేసర్ పతిరన అదరగొట్టేస్తున్నాడు. యువ ‘మలింగ’గా పేరొందిన అతడు చెన్నై తరఫున ఆడుతూ రాటుదేలాడు. -
MS Dhoni: 103 ఏళ్ల అభిమానికి ఎమ్ఎస్ ధోనీ అపురూపమైన కానుక.. వీడియో
తన 103 ఏళ్ల అభిమానికి ఎమ్ఎస్ ధోనీ ఓ అపురూపమైన కానుక అందించారు. తాను స్వయంగా ఆటోగ్రాఫ్ పెట్టిన చెన్నై జెర్సీని.. ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఆ జెర్సీని అందుకున్న రాందాస్ ఎంతగానో మురిసిపోయారు. వీడియో మీరూ చూడండి.
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
ముంబయి వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. చివరి మూడు మ్యాచుల్లో గెలిచినా నాకౌట్ దశకు చేరుకోవడం కష్టమే. గెలుస్తామనుకున్న మ్యాచుల్లోనే ఓటమిపాలై అభిమానులను నిరాశకు గురి చేసింది. -
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ పొట్టి కప్ బరిలోకి దిగబోతున్నాడు. ఈసారైనా తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవాలంటే కీలకమైన మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. -
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు