ODI WC 2023: నా ఆందోళనంతా ఆ ఆల్రౌండర్ గురించే: కపిల్ దేవ్
వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) మెగా టోర్నీకి ఇంకా వంద రోజుల సమయం ఉంది. అయితే, టీమ్ఇండియాకు గాయాల బెడద ఉంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్-2023 (ODI World Cup 2023) షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ సంగ్రామం ప్రారంభంకానుంది. దాదాపు వంద రోజుల సమయం ఉంది. ఈలోగా టీమ్ఇండియా (Team India) వెస్టిండీస్ పర్యటన, ఆసియా కప్, ఐర్లాండ్ సిరీస్లను ఆడనుంది. అయితే, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి టాప్ ప్లేయర్లు గాయాలబారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ వన్డే వరల్డ్ కప్ నాటికి ఫిట్నెస్ సాధించి ఫామ్ అందుకొంటారో లేదోననే ఆందోళన అభిమానుల్లో ఉంది. అయితే, టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) మాత్రం ఒకే ఒక్క ఆటగాడి ఫామ్పై ఆందోళన వ్యక్తం చేశాడు. అతడే పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya).
‘‘ప్రతి క్రీడాకారుడి జీవితంలో గాయాలు ఓ భాగం. అయితే, వేగంగా కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలి. ఇప్పటికే కొందరు కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. కానీ, హార్దిక్ పాండ్య గురించే చాలా ఆందోళనగా ఉన్నా. భవిష్యత్తులో ఎలా ఆడతాడనేది వేచి చూడాలి. ఎందుకంటే అతడు త్వరగా గాయాలబారిన పడుతున్నాడు. ఒకవేళ ఆటగాళ్లందరూ ఫిట్గా ఉంటే మాత్రం టీమ్ఇండియా తప్పకుండా వరల్డ్ కప్లో అద్భుతంగా రాణిస్తుంది. ఈ మెగా టోర్నీ ప్రతి నాలుగేళ్లకొకసారి వస్తుంది. అందుకే ప్రతి ఆటగాడు సిద్ధంగా ఉండాలి. మ్యాచ్ల కోసం ఎక్కువగా సాధన చేయాలి. మరిన్ని వన్డేలను ఆడాలి’’ అని కపిల్ దేవ్ తెలిపాడు.
రిషభ్ పంత్ పరిస్థితేంటో..: క్రిష్
‘‘రిషభ్ పంత్ గాయాల పరిస్థితి ఏంటో మనకు తెలియదు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పంత్ కోలుకుని ఆడగలిగితే వన్డే ప్రపంచకప్లో భారత్కు తిరుగుండదు. అయితే, అతడి ఫిట్నెస్ పరిస్థితి ప్రశ్నార్థకం. వన్డే ప్రపంచకప్ నాటికి ఫిట్ అవుతాడో లేదో ఎవరికీ తెలియదు. మెగా టోర్నీలో ఆడటంపైనా అనేక మందికి అనుమానం ఉంది. రిషభ్ జట్టులో ఉంటే అతడి ప్రభావం అధికంగా ఉంటుందనేది కాదనలేని సత్యం. కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నా. మిడిలార్డర్లో తప్పకుండా కీలకమవుతాడు. రోహిత్ శర్మ - శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా వస్తారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్లోనే ఉన్నాడు. వరల్డ్ కప్ నెగ్గడానికి భారత్కు ఎక్కువ అవకాశాలున్నాయి’’ అని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (క్రిష్) వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ