Kuldeep: జట్టు కూర్పు చాలా ముఖ్యం.. అందుకే ఎక్కువగా ఆలోచించను: కుల్దీప్
రెండో వన్డే మ్యాచ్లో (IND vs SL) టీమ్ఇండియా విజయం సాధించడంలో కేఎల్ రాహుల్ (KL Rahul)తోపాటు కుల్దీప్ యాదవ్ (KuldeepYadav) కీలక పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో శ్రీలంకపై టీమ్ఇండియా పోరాడి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకొంది. చివరి మ్యాచ్ ఆదివారం తిరువనంతపురం వేదికగా జరగనుంది. రెండో వన్డేలో లంకను కట్టడి చేయడంలో టీమ్ఇండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తన పది ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 51 పరుగులు ఇచ్చాడు. కీలకమైన కుశాల్ మెండిస్, అసలంక, శనక వికెట్లను పడగొట్టాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన ఆ జట్టు కెప్టెన్ శనకను బౌల్డ్ చేయడం గమనార్హం. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన కుల్దీప్ తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటున్నాడు.
‘‘కీలకమైన మ్యాచ్లో నా ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నా. నాకొచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించా. తుది జట్టులో ఉన్నప్పుడు లక్ష్యంపైనే దృష్టిసారించాలి. అలా కాకుండా బెంచ్పై ఉన్నప్పుడు కాస్త రిలాక్స్ అవొచ్చు. జట్టు కూర్పు చాలా ముఖ్యం. అందులో భాగంగా ఒక్కోసారి చోటు ఉండదు. అలాంటప్పుడు నేనేమీ తీవ్రంగా ఆలోచించను. అవకాశం వచ్చినప్పుడు మాత్రం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా’’
సూర్యకుమార్కే నేను బ్యాటింగ్ కోచ్..: చాహల్
మ్యాచ్ అనంతరం కుల్దీప్ను చాహల్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ‘‘ఎప్పుడూ ఒకే పేస్తో బౌలింగ్ చేయడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్తదనంతో బంతిని సంధిస్తూ ఉండాలి. నేను జట్టులో లేని గత ఏడాదంతా ఫిట్నెస్ మీద దృష్టిపెట్టా. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్ల సాయంతో ఫిట్నెస్ సాధించా. ఇది మరింత దూకుడుగా ఉండేందుకు సాయపడుతుంది. చాహల్ చాలా మద్దతుగా నిలిచాడు. (వెంటనే చాహల్ కలగజేసుకొని.. ఇంతకుముందు నేను సూర్యకుమార్కు బ్యాటింగ్ కోచ్ను అయ్యాను.. ఇప్పుడు నీకు బౌలింగ్ కోచ్గా మారా.. అనగానే ఇద్దరు నవ్వేశారు). నా బ్యాటింగ్పైనా కాస్త కసరత్తు చేశా’’ అని కుల్దీప్ తెలిపాడు. లంకపై మూడు వికెట్లు తీయడంతో కుల్దీప్ అన్ని ఫార్మాట్లు కలిపి 200 వికెట్ల మైలురాయికి చేరుకొన్నాడు. టెస్టుల్లో 34, వన్డేల్లో 122, టీ20ల్లో 44 వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్