Chahal in 2nd t20: చాహల్ను హార్దిక్ నమ్మడం లేదా..? ఆశ్చర్యపోయిన మాజీలు
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తీసుకున్న నిర్ణయాలపై మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్లో ఉన్న బౌలర్తో ఓవర్ల కోటా పూర్తిచేయించకపోవడం సరైంది కాదని విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ - భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్లో (WI vs IND) ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ముగిశాయి. రెండింట్లోనూ భారత్పై విండీస్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ రెండు మ్యాచుల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. యుజ్వేంద్ర చాహల్ను కెప్టెన్ హార్దిక్ పాండ్య వినియోగించుకున్న తీరు క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి టీ20లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చిన చాహల్ను ఏకంగా ఎనిమిది ఓవర్ల తర్వాత తిరిగి బౌలింగ్కు రప్పించాడు. చివరికి మ్యాచ్ మొత్తంలో మూడు ఓవర్లే ఇచ్చాడు. తాజాగా రెండో టీ20లోనూ మూడు ఓవర్లు వేసి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. అయినా, అతడితో పూర్తి ఓవర్ల కోటా వేయించకపోవడం గమనార్హం. ఆల్రౌండర్గా బరిలోకి జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్తో ఒక్క ఓవరూ వేయించలేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు వసీమ్ జాఫర్, ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు.
నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ
హార్దిక్.. ఇలాగైతే కష్టమే: జాఫర్
‘‘రెండో టీ20 మ్యాచ్లో హార్దిక్ తన బౌలర్లను వినియోగించుకున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది. చాహల్తో పూర్తి కోటా వేయించలేదు. అక్షర్ పటేల్కు ఒక్క ఓవర్ ఇవ్వలేదు. భారత్కు పూర్తిస్థాయి కెప్టెన్గా హార్దిక్ పాండ్యను భవిష్యత్తులో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్న వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. చాహల్, అక్షర్ పటేల్ మీద నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంది. వికెట్లు తీసి కట్టుదిట్టంగా బంతులను సంధిస్తున్నప్పటికీ నాలుగో ఓవర్ ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది’’ అని జాఫర్ తెలిపాడు.
18వ ఓవర్ అయినా..: ఆకాశ్ చోప్రా
‘‘చాహల్ భారత అత్యుత్తమ స్పిన్నర్. రెండో టీ20 మ్యాచ్లో 16వ ఓవర్ వేసిన చాహల్ రెండు వికెట్లు తీసి కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఆ ఓవర్లో రనౌట్ రూపంలో మరో వికెట్ కూడా వచ్చింది. ఇలాంటప్పుడు అతడితో 18 లేదా 19వ ఓవర్ అయినా వేయించి ఉంటే బాగుండేది. తప్పకుండా తన నాలుగో ఓవర్ వేసి ఉంటే ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చేదేమో’’ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఎండలిలా.. ప్రచారమెలా..!
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత