IND vs ENG: మీరు అలా చేస్తే రెండ్రోజుల్లోనే మ్యాచ్లు ఖతం! ఇంగ్లాండ్కు సిరాజ్ వార్నింగ్
భారత్లో బజ్బాల్ క్రికెట్ పనిచేయదని, కాదని ఇంగ్లాండ్ అలా చేస్తే మ్యాచ్లు ముగుస్తాయని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మైదానంలో ఇంగ్లాండ్తో టీమ్ఇండియా టెస్టు మ్యాచ్లో తలపడటం ఇదే మొదటిసారి. మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. టెస్టుల్లో కొంతకాలంగా అనుసరిస్తున్న బజ్బాల్ వ్యూహాన్ని ఉప్పల్ టెస్టులోనూ కొనసాగించాలని పర్యాటక జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇంగ్లాండ్కు ఓ హెచ్చరిక చేశాడు.
‘‘భారత్లో ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్ ఆడితే మ్యాచ్ ఒకటిన్నర లేదా రెండు రోజుల్లో ముగియవచ్చు. ఇక్కడి పిచ్లపై ప్రతిసారీ బంతిని హిట్టింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ బంతి కొన్నిసార్లు గింగిరాలు తిరుగుతుంది. మరికొన్నిసార్లు నేరుగా వికెట్ల మీదకు వస్తుంది. కాబట్టి భారత్లో బజ్బాల్ పనిచేయదని అనుకుంటున్నా. అలా కాదని వాళ్లు అదే పద్ధతిలో ఆడతే మాకే మంచిది. మ్యాచ్ తొందరగా ముగుస్తుంది’’ అని సిరాజ్ అన్నాడు. సిరీస్కు సన్నద్ధత గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లాండ్ చివరగా (2021లో) భారత్లో పర్యటించినప్పుడు నేను రెండు మ్యాచ్లు ఆడా. ఒక మ్యాచ్లో ఐదు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టా. జో రూట్, జానీ బెయిర్ స్టోను ఔట్ చేశా. నేను వేసిన ఓవర్లలో పరుగులు కట్టడి చేసి ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఒత్తిడిలో నెట్టడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం’’ అని హైదరాబాదీ పేసర్ వివరించాడు.
2020 చివరిలో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన సిరాజ్ ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్లో 23 మ్యాచ్లు ఆడి 68 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తన సొంతమైదానంలో టెస్టు మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. హోం గ్రౌండ్లో అతడు సత్తాచాటడంతోపాటు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి