Mohammad Kaif: హర్షల్ పటేల్ ఎవరికి బౌలింగ్ చేస్తున్నాడో తెలుసా..?
భారత టీ20 లీగ్ 15వ సీజన్లో బెంగళూరు జట్టు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూను ఓడించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది...
(Photos: Harshal Patel, Mohammad Kaif Instagram)
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్ 15వ సీజన్లో బెంగళూరు జట్టు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూను ఓడించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. అయితే, ఆ విజయం కోసం చివరి వరకూ పోరాడిన రాహుల్ టీమ్ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లలో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను గెలిచేలా కనిపించిన లఖ్నవూను కట్టడి చేశాడు.
తన అద్భుతమైన బౌలింగ్తో నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన అతడు.. మార్కస్ స్టాయినిస్ (9)వంటి ప్రమాదకర బ్యాట్స్మన్ను పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో బెంగళూరు విజయంలో హర్షల్ ముఖ్య భూమిక పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడి బౌలింగ్ను మెచ్చుకొన్న మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘హర్షల్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒక్క సిక్సర్ మాత్రమే కొట్టించుకున్నాడు. అతడి చేతి వేళ్లకు గాయాలున్నా బౌలింగ్ చేస్తున్నాడు. అది పక్కనపెడితే.. హర్షల్ ఎవరికి బౌలింగ్ చేస్తున్నాడు..? తన ముందున్నది మ్యాచ్ విన్నర్ వంటి కేఎల్ రాహుల్. అతడు అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
‘హర్షల్ బౌలింగ్లో రాహుల్ పుల్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో కొన్ని బంతులు వృథా అయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని బంతుల్ని మెల్లగా, మరికొన్ని బంతుల్ని బౌన్సీగా వేస్తూ బ్యాట్స్మెన్ను గందరగోళానికి గురిచేశాడు. స్టాయినిస్ కూడా అలాగే కొన్ని బంతులు వదిలేశాడు. చివరికి అతడు ఆడిన స్లో బౌన్స్ బంతిని డీప్ పాయింట్లో క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. అలా తన బౌలింగ్తో వైవిధ్యం చూపించాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసుకున్న అతడు ఈసారి కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. అయినా, ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులే ఇచ్చి ఒక కీలక వికెట్ తీయడం అభినందనీయం’ అని కైఫ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
UP: వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది