Mohammad Kaif: హర్షల్ పటేల్ ఎవరికి బౌలింగ్ చేస్తున్నాడో తెలుసా..?
భారత టీ20 లీగ్ 15వ సీజన్లో బెంగళూరు జట్టు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూను ఓడించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది...
(Photos: Harshal Patel, Mohammad Kaif Instagram)
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్ 15వ సీజన్లో బెంగళూరు జట్టు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూను ఓడించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. అయితే, ఆ విజయం కోసం చివరి వరకూ పోరాడిన రాహుల్ టీమ్ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లలో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను గెలిచేలా కనిపించిన లఖ్నవూను కట్టడి చేశాడు.
తన అద్భుతమైన బౌలింగ్తో నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన అతడు.. మార్కస్ స్టాయినిస్ (9)వంటి ప్రమాదకర బ్యాట్స్మన్ను పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో బెంగళూరు విజయంలో హర్షల్ ముఖ్య భూమిక పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడి బౌలింగ్ను మెచ్చుకొన్న మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘హర్షల్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒక్క సిక్సర్ మాత్రమే కొట్టించుకున్నాడు. అతడి చేతి వేళ్లకు గాయాలున్నా బౌలింగ్ చేస్తున్నాడు. అది పక్కనపెడితే.. హర్షల్ ఎవరికి బౌలింగ్ చేస్తున్నాడు..? తన ముందున్నది మ్యాచ్ విన్నర్ వంటి కేఎల్ రాహుల్. అతడు అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
‘హర్షల్ బౌలింగ్లో రాహుల్ పుల్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో కొన్ని బంతులు వృథా అయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని బంతుల్ని మెల్లగా, మరికొన్ని బంతుల్ని బౌన్సీగా వేస్తూ బ్యాట్స్మెన్ను గందరగోళానికి గురిచేశాడు. స్టాయినిస్ కూడా అలాగే కొన్ని బంతులు వదిలేశాడు. చివరికి అతడు ఆడిన స్లో బౌన్స్ బంతిని డీప్ పాయింట్లో క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. అలా తన బౌలింగ్తో వైవిధ్యం చూపించాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసుకున్న అతడు ఈసారి కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. అయినా, ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులే ఇచ్చి ఒక కీలక వికెట్ తీయడం అభినందనీయం’ అని కైఫ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
నౌక స్వాధీనం ఘటన.. భారత నావికుల్లో ఐదుగురికి ఇరాన్ విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్