Mohammed Siraj: తొలి మ్యాచ్లో సాధ్యంకానిది.. ఈసారి చేసి చూపా: మహమ్మద్ సిరాజ్
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో (SA vs IND) దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌటైంది. సఫారీ జట్టు పతనాన్ని మహమ్మద్ సిరాజ్ శాసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కేప్టౌన్లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చడంలో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) కీలక పాత్ర పోషించాడు. తొమ్మిది ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టాడు. రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా (SA vs IND) బౌలర్ల దెబ్బకు ఒకే రోజు 23 వికెట్లు కూలాయి. దీంతో టీమ్ఇండియా తొలి రోజే రెండోసారి బౌలింగ్ ప్రారంభించడం గమనార్హం. మొదటి రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడాడు. ‘ఒకే రోజు రెండు ఇన్నింగ్స్ల్లో బౌలింగ్కు వస్తావని ఊహించావా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చాడు. ఇంకా వికెట్ తీయలేదు.
‘‘నిజంగా ఒకే రోజు రెండు ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేస్తామని అనుకోలేదు. ఇప్పటికైతే మ్యాచ్లో మేం ఒకడుగు ముందే ఉన్నాం. క్రికెట్లో సానుకూల, ప్రతికూల పరిస్థితులుంటాయి. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించానని అనుకుంటున్నా. గత మ్యాచ్లో నేను ఏం చేయలేకపోయానో.. ఇప్పుడు ఈ టెస్టులో అది చేసి చూపించా. ఒకే విధమైన బంతులు నిలకడగా వేసి ఫలితం సాధించా. సెంచూరియన్ మాదిరిగానే కేప్ టౌన్ కూడా పేస్కు అనుకూలంగా ఉంది.
తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి బుమ్రాతో కలిసి కొన్ని మెయిడిన్లు వేశాం. దీంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పిచ్పై నిలకడగా లెంగ్త్తో బౌలింగ్ చేస్తే తప్పకుండా వికెట్లు దక్కుతాయని తేలింది. అలా కాకుండా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే అయోమయానికి గురికావాల్సి ఉంటుంది. మరోవైపు సీనియర్ బౌలర్, వికెట్ కీపర్ ఇచ్చే సూచనలూ చాలా కీలకం. సరైన లెంగ్త్తో బంతులు వేస్తే వికెట్లు వస్తాయనేది పసిగడితే చాలు. అందుకే తరచూ వారితో చర్చిస్తూ ఉంటే మన పని ఇంకా తేలికవుతుంది. ఒకవేళ మన బౌలింగ్లో నాలుగైదు బౌండరీలు కొట్టినా.. వికెట్ కోసం ఏ లెంగ్త్లో బంతిని వేయాలనేది తెలుస్తుంది. రెండో రోజు ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం మేం ఇంకా 36 పరుగుల ఆధిక్యంలోనే ఉన్నాం. వారిని త్వరగా ఆలౌట్ చేసి లీడ్ సాధించకుండా చూస్తాం’’ అని సిరాజ్ తెలిపాడు. తొలి టెస్టులో 91 పరుగులు ఇచ్చి రెండు వికెట్లను మాత్రమే తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా