Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమ్ఇండియా స్క్వాడ్.. మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
డబ్ల్యూటీసీ ఫైనల్కు (WTC Final) టీమ్ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల విఫలమవుతున్న సూర్యకుమార్ను పక్కన పెట్టేసి.. ఐపీఎల్లో (IPL) అదరగొట్టేస్తున్న రహానెకు చోటు కల్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) రెండో సీజన్ ఫైనల్లో భారత్ తలపడే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్న అజింక్య రహానె మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ను సెలెక్టర్లు పక్కనపెట్టేశారు. కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్కు కూడా అవకాశం దక్కలేదు. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాకు చోటు కల్పించలేదు. ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టుపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
బీసీసీఐ సెలెక్టర్లు, మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘అత్యుత్తమ జట్టును ప్రకటించారు. బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ మంచి పని చేశారు. వారికి నా అభినందనలు’’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఐపీఎల్ ముగిశాక.. లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఆసీస్తో టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. వరుసగా రెండోసారి టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు 2-1 తేడాతో ఆసీస్ను ఓడించి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
భారత జట్టు ఇదే: (Team India)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జయ్దేవ్ ఉనద్కత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత