IPL 2024: ఐపీఎల్ వేలంలో ఆ నిబంధన ఎత్తేస్తే వీరికి రూ.100 కోట్లు ఖాయం: రాబిన్ ఉతప్ప
ఐపీఎల్ (IPL) వేలంలో డబ్బు వెచ్చించడానికి ఫ్రాంఛైజీలకు పరిమితి లేకపోతే 10 మంది టీమ్ఇండియా ఆటగాళ్లు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుతారని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులున్న ఈ మెగా టోర్నీ మార్చి 22న ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటుచేసిన శిబిరాల్లో చేరి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సీజన్ కోసం కొన్ని జట్లు కీలక మార్పులు చేశాయి. గతేడాది జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్లు మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్రైడర్స్ రూ.24.75 కోట్లకు, పాట్ కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు కొనుగోలు చేశాయి. ఐపీఎల్ చరిత్రలో ఆటగాళ్లు రూ.20 కోట్ల కంటే ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారి.
ఈనేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) ఐపీఎల్లో భారీ వేతనాల గురించి మాట్లాడాడు. ఐపీఎల్ వేలంలో డబ్బు వెచ్చించడానికి ఫ్రాంఛైజీలకు పరిమితి లేకపోతే 10 మంది టీమ్ఇండియా ఆటగాళ్లు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుతారని పేర్కొన్నాడు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంఛైజీ రూ.100 కోట్లు ఖర్చు పెట్టడానికి వీలుంది. ‘‘ఒకవేళ బహిరంగ వేలం ఉండి ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టడానికి పరిమితి లేనట్లయితే కొంతమంది టీమ్ఇండియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. రూ.1000 కోట్లు లేదా రూ.500 కోట్లు అని లిమిట్ ఉంటే పది మంది భారత ప్లేయర్లు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతారు. జాబితాలో మొదట ఉండే పేరు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ కూడా రూ.100 కోట్ల పైచిలుకు ధర దక్కించుకుంటారు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కచ్చితంగా రూ.80 నుంచి 100 కోట్ల ధర పలుకుతారు’’ అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో ఉతప్పకు మంచి అనుభవం ఉంది. వివిధ ఫ్రాంఛైజీల తరఫున మొత్తం 205 మ్యాచ్లు ఆడి 4,952 పరుగులు చేశాడు. 27 అర్ధ సెంచరీలు కొట్టిన అతడు.. ఒక్కసారి కూడా సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. 2014లో కేకేఆర్ తరఫున 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్గా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?