SA vs IND: కవర్లు కొనడానికి డబ్బులు లేవా? దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై సునీల్ గావస్కర్ ఆగ్రహం
దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయింది. అయితే, మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ దక్షిణాఫ్రికా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
డర్బన్: మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ జరగాల్సిన కింగ్స్మీడ్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో టాస్ వేయడానికి నిర్దేశించిన సమయం కంటే ముందు నుంచే వర్షం కురిసింది. దీంతో మైదాన సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించాలని భావించినా మైదానం తడిగా ఉండటంతో చివరకు రద్దు చేశారు. మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) దక్షిణాఫ్రికా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్షం కురిసినప్పుడు ప్రపంచంలోని చాలా స్టేడియాల్లో మాదిరిగా పిచ్, మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచాలని సూచించాడు.
‘‘మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోతే ఒకవేళ వర్షం ఆగిపోయినా గంట వరకు మ్యాచ్ ప్రారంభం కాదని మీకు తెలుసు. మ్యాచ్ నిర్వహణకు మైదానాన్ని సిద్ధం చేసిన తర్వాత అకస్మాత్తుగా మళ్లీ వర్షం వస్తే ఏం చేయలేం. ప్రతీ క్రికెట్ బోర్డుకు చాలా డబ్బు వస్తోంది. అన్ని క్రికెట్ బోర్డుల దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది. ఒకవేళ బోర్డులు డబ్బు లేదని చెబితే అది కచ్చితంగా అబద్ధం. అయితే, బీసీసీఐ వద్ద ఉన్నంత డబ్బు మిగతా బోర్డుల దగ్గర ఉండకపోవచ్చు. కానీ, ప్రతి బోర్డు దగ్గర మైదానం మొత్తాన్ని కప్పడానికి అవసరమైన కవర్లను కొనుగోలు చేయడానికి సరిపోయేంత డబ్బు మాత్రం తప్పకుండా ఉంటుంది.
2019లో ఇంగ్లాండ్లో జరిగిన చాలా ప్రపంచకప్ మ్యాచ్ల్లో ఇదే సమస్య ఎదురైంది. వర్షం అంతరాయంతో చాలా జట్ల పాయింట్లు నష్టపోయాయి. ఔట్ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ పూర్తిగా జరగలేదు. ప్రతి బోర్డు మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలి. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈడెన్ గార్డెన్స్లో ఒక టెస్ట్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆట ప్రారంభం కాలేదు. తదుపరి మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దాన్నుంచి మీరు (దక్షిణాఫ్రికా) కూడా నేర్చుకోవాలి’’ అని సునీల్ గావస్కర్ సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్