Kohli : కోహ్లీ వల్లే.. టెస్టు క్రికెట్కు ఆదరణ పెరిగింది: షేన్ వార్న్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్కు ఆదరణ పెరిగిందని పేర్కొన్నాడు. తన నాయకత్వ పటిమతో ఎంతో..
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్కు ఆదరణ పెరిగిందని పేర్కొన్నాడు. తన నాయకత్వ పటిమతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపాడని అన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో భారత్ 1-2 తేడాతో పరాజయం పాలైన అనంతరం.. టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ ముగింపు పలికిన విషయం తెలిసిందే.
‘విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడి నాయకత్వంలోనే భారత్ టెస్టు క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వ్యూహాల విషయంలో అతడు మెరుగు పడాల్సి ఉన్నా.. నాయకుడిగా కొనసాగినంత కాలం జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపాడు. తన ఆటతీరుతో టెస్టు క్రికెట్ను ముందుకు తీసుకెళ్లిన తీరు చూశాక అతడిపై గౌరవం మరింత పెరిగింది. అతడో అద్భుతమైన క్రికెటర్. టెస్టు క్రికెట్కు గొప్ప రాయబారి. సుదీర్ఘ ఫార్మాట్ పట్ల అతడికి మక్కువ ఎక్కువ. ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో కూడా టెస్టు క్రికెట్కు ఆదరణ పెరిగిందంటే అది కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్ల వల్లనే సాధ్యమైంది. ఇలాంటి ఆటగాళ్లు లేకుంటే ఇప్పటికే చాలా దేశాలు సుదీర్ఘ ఫార్మాట్కు దూరమయ్యేవి. టెస్టుల ద్వారానే ఆటగాళ్ల సత్తా వెలుగులోకి వస్తుంది. టెస్టు క్రికెట్ను ప్రోత్సహించడంలో బీసీసీఐ కూడా ఎప్పుడూ ముందుంటుంది. ఆ విషయంలో మనమంతా కోహ్లీకి, అతడికి సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలి’ అని షేన్ వార్న్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ అనంతరం.. భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో రోహిత్ శర్మకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని షేన్వార్న్ సూచించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ