Shubman Gill:ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆడకుంటే పక్కన పెడతాం.. వైజాగ్ టెస్టుకు ముందు గిల్కు అల్టిమేటం!
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో రాణించకపోతే జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని భారత టీమ్మేనేజ్మెంట్ శుభ్మన్ గిల్ (Shubman Gill)ను హెచ్చరించిందట.
ఇంటర్నెట్ డెస్క్: వైజాగ్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో టీమ్ఇండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) (104; 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ శతకంతో పర్యటక జట్టు ముందు టీమ్ఇండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ మ్యాచ్ కంటే ముందు గిల్ ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టులు, ఇంగ్లాండ్తో తొలి టెస్టులో శుభ్మన్ కనీసం ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోవడమే ఇందుకు కారణం. దీంతో వైజాగ్ టెస్టులో అతడు తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు అద్భుతమైన ఆటతీరుతో శతకం బాది విమర్శకుల నోళ్లు మూయించాడు. అయితే, ఉప్పల్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయిన తర్వాత గిల్కు టీమ్మేనేజ్మెంట్ అల్టిమేటం జారీ చేసిందట. వైజాగ్ మ్యాచ్లో రాణించకపోతే జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని హెచ్చరించిందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
తొలి టెస్టులో విఫలమైన తర్వాత బ్యాటింగ్ మెరుగుపర్చుకోవడం కోసం రంజీ ట్రోఫీలో ఆడాలనుకున్నాడట. ఒకవేళ ఇంగ్లాండ్తో రెండో టెస్టులో విఫలమైతే ఫిబ్రవరి 9 నుంచి గుజరాత్తో జరిగే మ్యాచ్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగాలని గిల్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ‘‘నేను గుజరాత్తో మొహాలీలో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడతాను’’ అని గిల్ తన కుటుంబ సభ్యులలో ఒకరికి చెప్పాడట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం