IPL 2023: సన్రైజర్స్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
తెలుగువారి ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) పగ్గాలను మరోసారి విదేశీ ఆటగాడికే అప్పగించారు. ఈ సీజన్కు ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్గా మార్క్రమ్ను ప్రకటించారు.
హైదరాబాద్: ఐపీఎల్ (IPL) జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఆ జట్టు పగ్గాలను దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఏడెన్ మార్క్రమ్ (Aiden Markram)కు అప్పగించారు. ఈ విషయాన్ని సన్రైజర్స్ జట్టు గురువారం ట్విటర్ వేదికగా ప్రకటించింది.
సన్రైజర్స్ (SRH) జట్టుకు విదేశీ ఆటగాళ్లు నాయకత్వం వహించడం కొత్తేం కాదు. గతంలో కొన్నేళ్ల పాటు డేవిడ్ వార్నర్, ఆపై కేన్ విలియమ్సన్ నడిపించారు. మధ్యలో కొన్ని సార్లు భువనేశ్వర్ కుమార్కు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించినా అది తాత్కాలికమే. అయితే ఇప్పడు వార్నర్ (David Warner), విలియమ్సన్ (kane williamson) ఇద్దరూ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వార్నర్ గత సీజన్లోనే సన్రైజర్స్ను వీడగా.. ఈ సీజన్కు ముందు విలియమ్సన్ను సన్రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో జట్టు కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మార్క్రమ్ లేదా టీమ్ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరకు సన్రైజర్స్ యాజమాన్యం మార్క్రమ్కు అవకాశమిచ్చింది.
సన్రైజర్స్ యాజమాన్యానికి చెందిన అనుబంధ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టుకు కూడా మార్క్రమ్ సారథ్యం వహించాడు. ఇటీవల జరిగిన ఎస్ఏ20 (దక్షిణాఫ్రికా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్ టోర్నీ) టోర్నీలో మారక్రమ్ జట్టు విజేతగా నిలిచింది. దీంతో హైదరాబాద్ (SRH) పగ్గాలను కూడా అతడికే అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్