WI vs IND: విండీస్తో టెస్టు సిరీస్.. సెలెక్టర్లు మంచి ఛాన్స్ను మిస్ చేశారు: సన్నీ
విండీస్ పర్యటన (WI vs IND) కోసం పదిహేడు మందితో కూడిన వన్డే, టెస్టు జట్లను (Teams Selection) భారత్ ప్రకటించింది. సీనియర్ ఆటగాడు పుజారాను పక్కన పెట్టేసి.. యువకులకు అవకాశం ఇచ్చింది. అయినా సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో (WI vs IND) జులై 12 నుంచి ప్రారంభమయ్యే టెస్టు, వన్డే సిరీస్లకు భారత్ జట్టును (Team India) బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారాపై వేటు వేసిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ను ఎంపిక చేసింది. అయితే, టెస్టు సిరీస్కు జట్టును ఎంపిక చేసిన విధానంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్లో ఆడే ఆటగాళ్లను కేవలం వైట్బాల్ క్రికెట్పైనే దృష్టిపెట్టేలా చేయాల్సిందని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి మరింత మంది యువకులను అవకాశం ఇస్తే బాగుండేదని సూచించాడు.
‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసింది. అందులో భారత్ ఓడిపోయింది. తర్వాత టీమ్ఇండియా ఆడే మెగా టోర్నీ వన్డే ప్రపంచకప్. అంతకుముందు ఆసియా కప్ కూడా ఉంది. అందుకే, ఆ టోర్నీల్లో ఆడే ఆటగాళ్లకు టెస్టు క్రికెట్ నుంచి విరామం ఇస్తే బాగుండేది. వారిని వన్డేలపైనే దృష్టిపెట్టేలా చేయాల్సింది. ఎందుకంటే వచ్చే మూడు లేదా నాలుగు నెలలపాటు వరుసగా మ్యాచ్లు ఆడతారు. అలాగే విండీస్తో టెస్టు సిరీస్కు వారిని ఎంపిక చేయడం వల్ల మరింతమంది కుర్రాళ్లను జట్టులోకి తీసుకొనే ఛాన్స్ను సెలెక్టర్లు మిస్ చేశారు’’ అని గావస్కర్ తెలిపాడు.
అర్ష్దీప్ సింగ్ను తీసుకోకపోవడంపైనా సన్నీ స్పందించాడు. ‘‘కొన్నిసార్లు పక్కన పెట్టడం వల్ల ఆటగాళ్లకు మంచే జరుగుతుంది. వికెట్లను తీయాలనే పట్టుదల ఇంకా పెరుగుతుంది. నాణ్యమైన బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్ష్దీప్ సింగ్ విషయంలోనూ అదే జరగాలి. నిలకడగా ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే తప్పకుండా జట్టులోకి ఎంపిక చేస్తారు. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ ఆడే సత్తా అతడికే ఉంది. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో రాణిస్తున్నాడు. టీ20 బౌలర్గా వచ్చిన బుమ్రా తర్వాత కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అర్ష్దీప్ కూడా తప్పకుండా ముఖ్య భూమిక పోషిస్తాడు. రంజీల్లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. దేశవాళీలో అదరగొట్టేశాడు. అలాంటప్పుడు రంజీ ట్రోఫీని ఆడించడం ఆపేయాలి. అక్కడ రాణించినా ఫలితం లేకపోతే ఉపయోగం ఏముంటుంది?’’ అని అన్నాడు.
మా నాన్న ఏడ్చేశారు: యశస్వి
వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ప్రారంభమవుతుంది. యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్ను విండీస్ పర్యటనకు ఎంపిక చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన ఎంపికపై యశస్వి స్పందిస్తూ.. ‘‘విండీస్ పర్యటనకు ఎంపికైన విషయం విని మా నాన్న ఏడ్చేశారు. ప్రాక్టీస్ సెషన్ కోసం వెళ్లినప్పుడు సెలక్షన్ గురించి తెలిసింది. నాణ్యమైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. కొంచెం ఆందోళనగా ఉన్నప్పటికీ రాణిస్తాననే నమ్మకం ఉంది. నా సన్నద్ధతపై సీనియర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటా’’ అని చెప్పాడు. విండీస్ పర్యటన కోసం జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కు యశస్వి వెళ్లనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్