T20 World Cup:ధోనీ అందుకు డబ్బులు తీసుకోడు: జై షా
యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే చాలా జట్లు యూఏఈకి చేరుకున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..
ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే చాలా జట్లు యూఏఈకి చేరుకున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీమ్ఇండియాకు మెంటార్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ధోనీ కూడా ఆమోదం తెలిపాడు. అయితే, మెంటార్గా సేవలు అందించేందుకు ధోనీ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు.
‘టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియాకు మెంటార్గా సేవలు అందించేందుకు ధోనీ ఎలాంటి గౌరవ వేతనంను తీసుకోవడం లేదు’ అని జైషా అన్నారు. కాగా, ధోనీ మెంటార్గా నియమితుడు కావడంలో జైషా కీలకంగా వ్యవహరించాడు. ధోనీతో చర్చించి ఈ ప్రతిపాదనను అతడు అంగీకరించే విధంగా కృషి చేశాడు. ఈ ప్రతిపాదనకు ధోనీ అంగీకరించిన విషయాన్నిటీమ్ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు తెలియజేశాడు. ఇదిలా ఉండగా, 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ని ధోనీ సారథ్యంలో భారత్ గెలుపొందింది. తర్వాత ఐదు టీ20 ప్రపంచకప్లు జరగ్గా..టీమ్ఇండియా ఒక్క దాంట్లో కూడా విజేతగా నిలవలేదు.
ధోనీ 2019 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా తరఫున న్యూజిలాండ్తో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ సెమీఫైనల్స్లో జడేజా(77)తో కలిసి ధోనీ(50) రాణించినా భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత కొద్ది నెలలు ఆటకు విశ్రాంతి చెప్పిన మహీ తర్వాత 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే గతేడాది ఐపీఎల్లో ఆడినా నిరాశపర్చాడు. అయితే, ప్రస్తుత సీజన్లో చెన్నై ఫైనల్స్కి చేరింది. చూస్తుంటే ధోనీ సీఎస్కేకు మరో ట్రోఫీని అందించేలా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాను కూడా టీ20 ప్రపంచకప్లో మెరిపించాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!