Rohit Sharma: సారథిగా.. ధోనీ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ
దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో...
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఒకే ఏడాదిలో అత్యధిక టీ20ల్లో టీమ్ఇండియాను విజేతగా నిలిపిన కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ధోనీ నాయకత్వాన భారత్ 2016లో 15 టీ20ల్లో ఛేదించి విజయం సాధించగా.. రోహిత్ శర్మ 16 మ్యాచుల్లో టీమ్ఇండియాను విజేతగా నిలిపాడు.
దక్షిణాఫ్రికాతో మరో రెండు టీ20లు, అక్టోబర్లో ఆసీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ రికార్డు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. గత టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీమ్ఇండియాకు పూర్తిస్థాయి కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా (జూన్లో), ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మీదనే కాకుండా ఆసియా కప్లో పాక్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్పై రోహిత్ సారథ్యంలో భారత్ విజయాలను నమోదు చేసింది. ద్వైపాకిక్షిక సిరీస్ల్లో జట్టు అద్భుతంగా నడిపిస్తున్న రోహిత్ తన తొలి మెగా టోర్నీలో మాత్రం విఫలమయ్యాడు. ఆసియా కప్లో సూపర్-4 దశకే పరిమితమైన భారత్.. ఫైనల్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో వచ్చే టీ20 ప్రపంచకప్లో జట్టును విజయపథంలో నడిపించాలని అభిమానులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.