T20 World Cup: టీమ్ఇండియా కథ ఇంటికే.. ఆఖరి మ్యాచ్ నామమాత్రమే!
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రయాణం లీగ్దశలోనే ముగియనుంది. సూపర్ 12 గ్రూప్-2లో ఇప్పటికే పాకిస్థాన్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రయాణం లీగ్దశలోనే ముగిసింది. సూపర్-12 గ్రూప్-2లో ఇప్పటికే పాకిస్థాన్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. తాజాగా అఫ్గానిస్థాన్ మీద న్యూజిలాండ్ గెలిచి గ్రూప్లో రెండో స్థానంతో సెమీస్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇక సోమవారం (నవంబర్ 8న) భారత్-నమీబియా మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమే.
పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాతో కూడిన గ్రూప్లో భారత్ ఉంది. మన ఆటగాళ్ల ఫామ్ను చూస్తే నాకౌట్ దశకు టీమ్ఇండియా సులువుగానే చేరుకుంటుందని అందరూ భావించారు. ఎందుకంటే పాక్, కివీస్ మాత్రమే పెద్ద జట్లు కాగా.. మిగతా మూడింటితో ఇబ్బందేమీ లేదు. అయితే తొలి రెండు మ్యాచ్ల్లోనే ఓడిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచినా.. మరోవైపు న్యూజిలాండ్ కూడా పాక్ మీద తప్ప.. మిగతా అన్నింట్లోనూ విజయం సాధించింది. ఇక పాకిస్థాన్ 10 పాయింట్లతో (ఐదుకి ఐదు విజయాలు) తొలి స్థానం సాధించి ఇప్పటికే సెమీస్కు చేరుకుంది. కివీస్ (8 పాయింట్లు) ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి రెండో స్థానంతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆ తర్వాత టీమ్ఇండియా(4 పాయింట్లు), అఫ్గాన్ (4 పాయింట్లు). నమీబియా (2), స్కాట్లాండ్ (0) ఉన్నాయి.
కివీస్తో ఓటమే పెద్ద దెబ్బ..
ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్లోకి అడుగుపెట్టిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ కప్ టోర్నీల్లో భారత్పై పాకిస్థాన్కు ఒక్క విజయం లేదు.. ఈ క్రమంలో ఈసారీ టీమ్ఇండియా విజయ ఢంకా మోగిస్తుందిలే అని క్రికెట్ అభిమానులు భావించారు. అయితే భారత్ను చిత్తు చేసిన పాక్ చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సరే.. భావోద్వేగాల మధ్య జరిగిన మ్యాచ్లో మనోళ్లు ఓడిపోయారులే అని అభిమానులు సర్దుకున్నారు. తర్వాత న్యూజిలాండ్తో మ్యాచ్కు వారం సమయం ఉంది కదా.. పుంజుకుంటారులే అనుకున్నారు.. కానీ మరోసారి భంగపాటు తప్పలేదు. అయితే కనీసం పోరాటం చేయలేక చేతులెత్తేయడమే సగటు అభిమానిని బాధ పెట్టిన అంశం. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమై పరాభవం మూటగట్టుకున్నారు. తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించినా లాభం లేకుండా పోయింది. పాకిస్థాన్తోపాటు కివీస్ సెమీస్కు దూసుకెళ్లింది. భారత్ ఇంటిముఖం పట్టక తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్