Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ (World Cup 2023)కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్. అది కూడా సొంతగడ్డపై. కాబట్టి ఈ సిరీస్ను ప్రపంచకప్ సన్నాహకం కోసం ఉత్తమంగా ఉపయోగించుకోవాలని టీమ్ఇండియా (Team India) చూసింది. తొలి రెండు వన్డేల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ (World Cup 2023)కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్. అది కూడా సొంతగడ్డపై. కాబట్టి ఈ సిరీస్ను ప్రపంచకప్ సన్నాహకం కోసం ఉత్తమంగా ఉపయోగించుకోవాలని టీమ్ఇండియా (Team India) చూసింది. తొలి రెండు వన్డేల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వర్షం అంతరాయం కారణంగా 99 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అప్పుడు అన్నీ కుదురుకున్నట్లే కనిపించాయి. టీమ్ఇండియాకు ఇక తిరుగులేదనిపించింది. కానీ మూడో వన్డేకు వచ్చేసరికి మరోసారి భారత జట్టు బలహీనంగా మారిపోయింది. ఈ మ్యాచ్లో ఓటమితో జట్టులోని డొల్లతనం బయటపడిందనే చెప్పాలి. ప్రపంచకప్కు ముందు ఈ ఓటమి జట్టుకు మేలు చేసేదే! కప్పు ముందు కనువిప్పు కలిగించేదే! ఈ ఓటమి నుంచి పాఠాలు నేరిస్తే.. అది ప్రపంచకప్లో భారత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక్క మ్యాచే అనుకుంటే..
ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలు గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ దక్కించుకున్నాం కదా.. ఒక్క మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన ఏమవుతుందిలే అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమే. విశ్వ విజేతగా నిలవాలంటే ప్రతి మ్యాచ్నూ ఎంతో కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. రాబోయే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. అంటే 10 జట్లు పోటీపడే టోర్నీలో.. మొదట ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ దశలో ఒక్క మ్యాచ్లో ఓడినా.. మిగతా వాటిల్లో గెలిచి ముందంజ వేయొచ్చు. ఈ దశ ముగిసే సరికి తొలి నాలుగులో ఉన్న జట్లు నేరుగా సెమీస్ ఆడతాయి. కానీ అక్కడి నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. ఇక్కడ ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అత్యంత తీవ్రత, ఒత్తిడి ఉండే ఈ మ్యాచ్ల్లో గెలిచిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఈ విషయం టీమ్ఇండియాకు తెలియంది కాదు. 2011 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత్.. ఆ తర్వాత వరుసగా రెండు వన్డే ప్రపంచకప్లోనూ సెమీస్లోనే ఇంటి ముఖం పట్టింది. కాబట్టి నిలకడ కొనసాగించడం ఎంతో ముఖ్యం.
పట్టు వదలొద్దు..
ప్రపంచకప్ను ముద్దాడాలంటే పట్టు వదలకుండా ముందుకు సాగాలి. ఒక మ్యాచ్లో అద్భుతమైన ఆటతీరుతో మెప్పించి.. ఆ వెంటనే మరో పోరులో పేలవ ప్రదర్శనతో తుస్సుమనిపిస్తే ప్రయోజనం ఉండదు. ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శిస్తేనే ఛాంపియన్గా నిలుస్తాం. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ అదరగొట్టింది. మొదట శుభ్మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీలు.. కేఎల్ రాహుల్ (52), సూర్యకుమార్ యాదవ్ (72*) మెరుపులతో జట్టు 399 పరుగుల భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా 33 ఓవర్లలో 317 పరుగులుగా లక్ష్యాన్ని సవరించగా.. ఛేదనలో ఆసీస్ను మన బౌలర్లు దెబ్బ కొట్టారు. అశ్విన్ (3), జడేజా (3), ప్రసిద్ధ్ కృష్ణ (2) వికెట్ల వేటలో సఫలమయ్యారు. కానీ మూడో వన్డేకు వచ్చేసరికి ప్రతీకారంతో ఆసీస్ చెలరేగిపోయింది. మొదట బ్యాటింగ్లో 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో మన బౌలర్లు తీవ్రత కొనసాగించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఆసీస్ బ్యాటర్లు చెలరేగుతుంటే కట్టడి చేసేందుకు విభిన్న మార్గాలను అన్వేషించడంలో భారత్ విఫలమైంది. మధ్యలో బుమ్రా, కుల్దీప్ కాస్త పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. ఇక బ్యాటింగ్లో మంచి ఆరంభాలను రోహిత్ శర్మ (81), కోహ్లి (56), శ్రేయస్ అయ్యర్ (48) సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే జట్టుకు విజయాన్ని అందించే వరకు పట్టు వదలకుండా పోరాటాన్ని కొనసాగించడం ముఖ్యం. బౌలింగ్, బ్యాటింగ్లోనూ తీవ్రత కొనసాగించడం ప్రధానం. అలసత్వానికి అసలు చోటే ఇవ్వకూడదు. బ్యాటింగ్లో, బౌలింగ్లోనూ మధ్యలో అలసిపోవడం, ఆగిపోవడం అనే మాటే ఉండకూడదు. ప్రపంచకప్ బరిలో దిగే మన జట్టు బలంగా ఉంది. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో సాగితే భారత్ మూడోసారి వన్డే విశ్వ విజేతగా నిలవడం ఖాయం. ఆ దిశగా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ సాగితే టీమ్ఇండియాకు తిరుగుండదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..