Ashwin - Morgan: అశ్విన్ రనౌట్ అయ్యుంటే మోర్గాన్ ఏం చేసేవాడివి?
ఇటీవల కోల్కతా, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ‘క్రీడాస్ఫూర్తి’ అనే అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ ...
కోల్కతా కెప్టెన్ను నిలదీసిన బ్రాడ్హాగ్
(Photo: Brad Hogg Twitter)
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల కోల్కతా, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ‘క్రీడాస్ఫూర్తి’ అనే అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ స్పందిస్తూ ట్విటర్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రీడాస్ఫూర్తిని ప్రశ్నించాడు. అసలేం జరిగిందంటే.. మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి విసిరిన త్రోకు.. బంతి రిషబ్ పంత్ను తాకి మరికాస్త దూరం వెళ్లింది.
అప్పుడు మరో ఎండ్లో ఉన్న అశ్విన్ రెండో పరుగు కోసం పంత్ను ప్రోత్సహించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇయాన్ మోర్గాన్ అశ్విన్తో మాటల యుద్ధానికి దిగాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, అతడి చర్య సిగ్గుచేటని విమర్శించాడు. మరుసటి ఓవర్లో అశ్విన్ ఔటై పెవిలియన్కు వెళుతుండగా.. మోసం చేస్తే ఇలాగే జరుగుతుందని టిమ్సౌథీ వ్యాఖ్యానించాడు. దీంతో అశ్విన్, సౌథీ, మోర్గాన్ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అనంతరం దినేశ్ కార్తీక్ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆసీస్ మాజీ స్పిన్నర్ మోర్గాన్ క్రీడాస్ఫూర్తిని నిలదీశాడు. త్రిపాఠి విసిరిన త్రో బంతికి.. పంత్ రెండో పరుగు కోసం వెళ్లకుండా ఆగిపోయి.. అదే సమయంలో అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించి రనౌటైతే కోల్కతా కెప్టెన్ అప్పుడు తిరిగి బ్యాటింగ్ చేయమని పిలిచేవాడా? అని ట్వీట్ చేశాడు. క్రికెట్లో లేని నియమాలను తోసి పారేయాలని, నిబంధనలకు అనుగుణంగా ఆడాలని హాగ్ సూచించాడు. అయితే, ఎంసీసీ నిబంధనల్లో ఇలాంటి సందర్భాల్లో పరుగు తీయొచ్చని పేర్కొని ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..