IPL 2021: ధోనీ రిటైర్ అయ్యాక అత్యుత్తమ ఫినిషర్గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు: పాంటింగ్
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ఫామ్లోకి రావడంపై దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ మాజీ సారథి మాట్లాడుతూ...
ఇంటర్నెట్డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ఫామ్లోకి రావడంపై దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ మాజీ సారథి మాట్లాడుతూ.. ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక గొప్ప ఆటగాడిగా గుర్తుండిపోతాడని కొనియాడాడు. చివర్లో చెన్నై సారథిని నిలువరించలేకపోయామని చెప్పాడు. తమ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు వేయలేక మూల్యం చెల్లించుకున్నారన్నాడు.
‘రుతురాజ్(70) ఔటయ్యాక జడేజా వస్తాడా, ధోనీ వస్తాడా అని డగౌట్లో మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అప్పుడు ధోనీ వస్తాడని అనుకొని మా ఆటగాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్ చేయమని సైగలు చేశా. చివరికి మేం అనుకున్న రీతిలో అతడిని కట్టడిచేయలేకపోయాం. ధోనీని వదిలేస్తే మూల్యం చెల్లించుకునేలా చేస్తాడని తెలుసు. అతడు చాలా ఏళ్లుగా అదే పని చేస్తున్నాడు. ఈసారి మా బౌలర్లు అతడిని కట్టడి చేయడానికి అవసరమైన ప్రదేశాల్లో బంతులు సంధించలేకపోయారు. అతడు రిటైర్ అయ్యాక క్రికెట్లో ఒక గొప్ప ఫినిషర్గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు’ అని పాంటింగ్ కొనియాడాడు.
మరోవైపు ధోనీ ఆటచూసి దిగ్గజ ఆటగాడు, టీమ్ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ సైతం మురిసిపోయాడు. మహీ అవసరమైన వేళ బాధ్యత తీసుకొని ముందుండి నడిపించాడని మెచ్చుకున్నాడు. ‘జడేజా బాగా ఆడుతున్నా ఈసారి ధోనీనే ముందు బ్యాటింగ్కు వచ్చాడు. తను బాధ్యత తీసుకొని కెప్టెన్గా గెలిపించాలనుకున్నాడు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అవసరమైన వేళ బరిలోకి దిగి స్టైలిష్గా పని పూర్తి చేశాడు. ఈ ఫ్రాంఛైజీ గతేడాది మినహా ప్రతిసారీ మెరిసింది. 2020లో ఒక్కసారే దారి తప్పింది. ఇప్పుడా జట్టు ఎలా ఆడుతుందో చూడండి. అదిరిపోయే ప్రదర్శనతో తిరిగొచ్చింది. ఆటగాళ్ల భావోద్వేగాలు చూడండి. అలాగే అభిమానులు కూడా చెన్నై సూపర్ కింగ్స్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోనీ బ్యాటింగ్కు వచ్చేముందు టెక్నికల్ అంశాలపై చాలా విషయాలు చర్చించినట్లు చెప్పాడు. ఒక సారథిగా వెళ్లి ధోనీ మ్యాచ్ను పూర్తి చేస్తాడనే నమ్మకాన్ని తాను అడ్డుకోలేదని తెలిపాడు. ధోనీ ఈ మ్యాచ్లో అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, దాని ఫలితం చూశామన్నాడు. ఇక చివర్లో అతడు బౌండరీ బాది మ్యాచ్ను గెలిపించిన వెంటనే ఆటగాళ్లంతా భావోద్వేగం చెందరన్నాడు. ధోనీ బరిలోకి దిగే ప్రతిసారి బాగా ఆడాలనే తాము ఆశిస్తామని చెప్పాడు. అతడిపై భారీ అంచనాలు ఉంటాయని, ఈ క్రమంలోనే ఇప్పుడు విజయంతో ముగించాడని ఫ్లెమింగ్ ప్రశంసించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు